ఈ మధ్యకాలంలో దారుణమైన ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ యువకుడిని చెట్టుకు వేలాడదీసి చిత్ర హింసలకు గురిచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాకయ్యారు.
ఈ మధ్యకాలంలో అనేక రకాలైన దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు ఎదుటి వ్యక్తిపై దాడులకు పాల్పడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఎదుటి వ్యక్తి నిజంగా తప్పు చేశాడా? లేదా? అని నిర్ధారించుకోకుండా కేవలం అనుమానిస్తుంటారు. అంతేకాక సందేహం ఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో దారుణం హతమారుస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అమ్మాయిని కిడ్నాప్ చేశాడనే అనుమానంతో ఓ యువకుడిపై కొందరు దాడికి పాల్పడ్డారు. చెట్టుకు వేలాడదీసి చిత్రం హింసలకు గురి చేశారు. ఈ అమానుష ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతితో సంబంధం పెడ్డుకున్నాడన్న ఆరోపణలను రావడంతో కొందరు దుండగులు ఓ యువకుడిపై దాడి చేశారు. అతడిని బంధించి తీవ్రంగా హింసించారు. తాళ్లతో కట్టి చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. తమ గ్రామానికి చెందిన యువతితో సన్నిహితంగా ఉంటూ.. ఆమెను అపహరించాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. యువకుడిని చెట్టుకు వేలాడదీసి తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కాస్తా పోలీసుల వద్దకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత యువకుడితో పాటు అతడితో సన్నిహితంగా ఉందని భావిస్తున్న యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.