గత కొంత కాలంగా భారత్ – చైనా మద్య రగడ కొనసాగుతుంది. భారత్ చైనాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. వివాదాస్పదమైన హిమాలయ ప్రాంత సరిహద్దు యుద్ధానికి మూల కారణంగా చెప్పుకున్నప్పటికీ ఇతర సమస్యలు కూడా దోహదమయ్యాయి. అప్పటి నుంచి చైనా కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. మరోవైపు సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపులకు భారత్ దీటుగా బదులిస్తోంది. యుద్ధం జరిగితే శత్రువులకు తగిన రీతిలో బుద్ధిచెప్పేందుకు అన్ని వ్యవస్థలను సిద్ధంచేస్తూ నిత్యం మాక్డ్రిల్ నిర్వహిస్తోంది.
ఇది చదవండి : శని, ఆదివారాల్లో పూర్తి కర్ఫ్యూకి సిద్దమైన ప్రభుత్వం
భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది. దేశ సరిహద్దులో చైనా మరోసారి హద్దుమీరింది. గల్వాన్ లోయలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 1న ఆ దేశ జాతీయ జెండాను ఎగురవేసింది. అయితే గల్వాన్ లోయలో జెండాను ఆవిష్కరించి రెచ్చగొట్టిన చైనాకు అంతే ధీటుగా భారత సైన్యము జవాబిచ్చింది. గల్వాన్ వ్యాలీలో చైనా జెండాను ఆవిష్కరించిన రోజునే మన సైన్యమూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. తాజాగా దానికి సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో ఫొటోలను తాజాగా పోస్ట్ చేశారు. అంతకుముందు గతేడాది డిసెంబర్ 30 రాత్రి అరుణాచల్ స్కౌట్స్, అస్సాం రెజిమెంట్ జవాన్లతో కలిసి రిజిజు అరుణాచల్ ప్రదేశ్ లోని బోమ్డిలాలోని ఆర్ఆర్ హిల్స్ లో కలియతిరిగారు. సైనికులతో మాట్లాడారు. భారత సైన్యం జోష్ ఎప్పుడూ అత్యున్నతంగానే ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.
The JOSH of #IndianArmy is always high even at freezing temperature of below -8°C !!
Spent time with brave Army Jawans from Assam Regiment & Arunachal Scouts. We walked at RR Hills near Bomdila, Arunachal Pradesh. pic.twitter.com/xSevU7Wk6m
— Kiren Rijiju (@KirenRijiju) December 30, 2021