నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని బాత్రూంలో ఉండగా ముగ్గురు అమ్మాయిలు వీడియో చిత్రీకరించడం సంచలనంగా మారింది. అయితే ఇది జరిగి వారం రోజులు అవుతున్నా పోలీసులు ఇప్పటి వరకూ వీడియో రికార్డ్ చేసిన వారిపై కేసు నమోదు చేయలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలోని ఉడుపి టౌన్ లో ఉన్న మహిళా నర్సింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థినులు మరో అమ్మాయి నగ్న వీడియో చిత్రీకరించారు. నర్సింగ్ కాలేజీలో చదువుకుంటున్న ఓ అమ్మాయి బాత్రూమ్ లో ఉండగా.. మరో ముగ్గురు అమ్మాయిలు సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేశారు. ఇది జరిగి వారం రోజులు అవుతున్నా కూడా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు, బాధితురాలు తరఫున మాట్లాడేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉడుపి వాసి, సోషల్ యాక్టివిస్ట్ రష్మీ సమంత్ ట్వీట్ చేశారు. మరో వర్గానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఈ వీడియో తీశారని రష్మీ సమంత్ ట్వీట్ చేశారు. దీంతో ఈ పోస్టు సంచలనంగా మారింది.
విషయం పెద్దదవ్వడంతో ముగ్గురు విద్యార్థినులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేశారు. వీళ్లంతా నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఈ ఘటన జూలై 19న ఉడుపిలో ఉన్న ప్రైవేట్ కంటి ఆసుపత్రి మరియు నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అంటూ ప్రచారం చేస్తున్నారని.. రష్మీ సమంత్ మండిపడ్డారు. విద్యార్థిని బాత్రూమ్ లో ఉండగా సీక్రెట్ గా మొబైల్ తో వీడియో తీసిన మాట నిజమేనని నేత్రజ్యోతి నర్సింగ్ కళాశాల డైరెక్టర్ రష్మీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారి నుంచి మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. కాగా 1992లో జరిగిన అజ్మీర్ ఘటనతో ఉడుపి ఘటనను పోల్చుతున్నారు.
అజ్మీర్ కేసులో ఓ వర్గానికి చెందిన వారు వందలాది పాఠశాల, కళాశాల విద్యార్థినులను నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారు. ఇదే తరహా ఘటన ఇప్పుడు పునరావృతం అవుతుందని అంటున్నారు. ఓ వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన అమ్మాయిల నగ్న వీడియోలు చిత్రీకరించి తమ వర్గం వారికి షేర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కావాలని బాత్రూంలో కెమెరాలు పెట్టి వీడియో రికార్డ్ చేసి.. వాట్సాప్ లో గ్రూపుల్లో షేర్ చేస్తున్నారని.. అయితే ఇప్పటి వరకూ కూడా ఉడుపి పోలీసులు కారకులపై కేసు నమోదు చేయలేదని బాధితురాలి తరఫున వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం అలాంటిదేమీ జరగలేదని.. ఎలాంటి సీక్రెట్ కెమెరాలు పెట్టలేదని అంటున్నారు. ఒకవేళ అదే నిజం అనుకుంటే కాలేజ్ యాజమాన్యం ముగ్గురు అమ్మాయిలను ఎందుకు సస్పెండ్ చేసిందో చెప్పాలని అంటున్నారు. మొత్తానికి మహిళా నర్సింగ్ కాలేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.