తమ పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టం ధరి చేరకూడదని, ఉన్నతంగా స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. వారి స్థోమతకు తగ్గట్టుగా విద్యాభ్యాసాన్ని అందించడం అన్నీ చేస్తారు. కానీ, ఆడపిల్లల పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి అదొక తలకు మించిన భారంగా భావిస్తుంటారు. అందుకే ఆడబిడ్డలకు ఆర్ధిక భరోసా ను ఇచ్చే అదిరిపోయే స్కీమ్ ఒకటి ఉంది.
కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటి ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తుంది. అలానే వివిధ రకాల స్కీమ్ ల ద్వారా ప్రజలకు అనేక రకాల ఆర్ధిక ప్రయోజనాలను కల్పిస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి ఆర్ధిక భరోసా, ప్రయోజనం చేకూర్చేలే అనేక రకాల స్కీమ్ లను కేంద్రం ప్రవేశపెట్టింది. అలానే అమ్మాయిల కోసం కూడా అనేక రకాల పథకాలను ప్రారంభించారు. అలాంటి వాటిల్లో ప్రధానమైనది సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ అమ్మాయిల ఉన్నత చదువుల లేదా పెళ్లి కోసం అవసరమైనప్పుడు భారీ నిధులు పొందుతారు. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్కీమ్ లో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. ముఖ్యంగా కుమార్తెల కోసం ఈ పథకం ప్రారంభించబడింది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో యువతల పేరున వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కస్టమర్లకు అనేక బ్యాంకులు సులభతరం చేస్తున్నాయి. అలానే ఇతర బ్యాంకులతో సహా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
సుకన్య సమృద్ధి పథకం కింద ముందుగా మీరు రూ.250 తో అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. ఇందులో సంవత్సరానికి గరిష్టంగా రూ.1.50 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.12,500 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇకపోతే మీరు నెలకు ఎంత డబ్బులు మీ ఖాతాలో వేస్తారనేది మీ ఇష్టం. మీరు నెలకు రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలకు పైగా వస్తాయి. మీరు ఈ డబ్బును నెలవారీ వాయిదాలలో కూడా డిపాజిట్ చేయవచ్చు. అనుకోని కారణాల వల్ల ఆర్థిక సంవత్సరంలో మీ వద్ద రూ.1.5 లక్షలు లేకపోతే, రూ.250 డిపాజిట్ చేసి ఖాతాను కొనసాగించవచ్చు. ఎస్బీఐ నుంచి వచ్చిన ఓ ట్వీట్ ద్వారా ఈ సమాచారం ఇవ్వబడింది.
ఈ ప్రభుత్వ పథకంలో మీకు ఆదాయంపై భరోసా ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. అందువల్ల ఉద్యోగం చేసే వారికి ఈ స్కీమ్ చాలా అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు.అయితే ఈ స్కీమ్ లో ఒక ఇంటి నుంచి గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే చేరవచ్చు. ఒకవేళ మొదటి కుమార్తె పుట్టిన తర్వాత ఇద్దరు కవల కుమార్తెలు ఉన్నట్లయితే, ఈ సందర్భంలో ముగ్గురు కుమార్తెలు ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్కీమ్ ద్వారా 7.6 శాతం వడ్డీ లభిస్తోంది.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరాలనుకునే వారు కొన్ని పత్రాలను బ్యాంకుల్లో సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ బుక్, ఆధార్ కార్డు, అర్హురాలి ఫోటోలు, ఆమె ఆధార కార్డు, బర్త్ సర్టిఫికెట్ వంటి ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.సుకన్య సమృద్ధి యోజన ఖాత తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు పెట్టుబడిగా పెడుతూనే ఉండాలి. తర్వాత డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అమ్మాయికి 18 నిండిన తర్వాత కొంత డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బులు పొందొచ్చు. మరి.. ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.