సాధారణంగా ప్రతి వ్యక్తి తన అవసరానికి బ్యాంకు ద్వారా లోన్స్ తీసుకుంటారు. బ్యాంకు రూల్స్ ప్రకారం ఒప్పందంతో చెల్లిస్తారు. అయితే రాబోయే రోజుల్లో పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే కొన్ని ఆంక్షలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిస్తోంది.
భారత దేశంలోని కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్. జాతీయ స్ధాయిలో చెల్లింపులు, రుణాలు కొనసాగించడం మొదలైన వ్యవహారాలను రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసంధానగా వ్యవహరిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి బ్యాంకుకు ముఖ్యమైన బ్యాంకుగా బ్యాంకింగ్ ఖాతాలను నిర్వహిస్తుంది.
సాధారణంగా ప్రతి వ్యక్తి తన అవసరానికి బ్యాంకు ద్వారా లోన్స్ తీసుకుంటారు. బ్యాంకు రూల్స్ ప్రకారం ఒప్పందంతో చెల్లిస్తారు. అయితే రాబోయే రోజుల్లో పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే కొన్ని ఆంక్షలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అసురక్షిత రిటైల్ లోన్స్, క్రెడిట్ కార్డులను జారీ చేసే ముందు కస్టమర్ల పూర్తి వివరాలను వెరిఫై చేసేందుకు మరిత కఠినతరం చేయాలని నిర్ణయించింది. Unsexured రుణాలకు బ్యాంకులు కస్టమర్ల వద్ద ఏ వస్తువులు తాకట్టు పెట్టుకోరు. ఇలా ఇచ్చిన రుణాలకు అధిక వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ ట్రెండ్ చాలా వేగంగా పెరుగుతుంది. దీనితో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం, గత సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి నెల వరకు వ్యక్తిగత రుణాలు రూ. 33 లక్షల కోట్ల నుంచి రూ. 40 లక్షల కోట్లకు పెరిగాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 20.4శాతం పెరిగింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం మధ్య అన్సెక్యూర్డ్ క్రెడిట్ పెరగడం ఆర్థికపరంగా ఆందోళన కలిగించే విషయమని ఆర్బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ తీసుకునేవారిపై కఠిన ఆంక్షలు జారీ చేసింది. బ్యాంకుల వైపు కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.