భారత దేశంలో కొంత కాలంగా రైతులు తమ సమస్యలపై ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం సైతం రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రామ, మండల స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టారు. రైతు దీక్ష పేరుతో ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ వరి ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షకు రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా కొనుగోలు విధానం ఒక రకంగా ఉండాలని.. లేదంటే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందని చెప్పారు. తాము ముందు నుంచి రైతుల కోసం పోరాడుతున్నామని.. తమది ఓట్ల దీక్షలు కావని.. రైతు దీక్షలని స్పష్టం చేశారు. ఇటీవల రైతుల కోసం సీఎం మమతా బెనర్జీ కూడా పోరాటం చేశారని.. మద్దతు ఇచ్చారని అన్నారు. దేశంలో రైతుల కోసం పోరాటం ఎవరు చేసినా తాను మద్దతు తెలుపుతానని స్పష్టం చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటం అభినందనీయమని రాకేశ్ టికాయత్ ప్రశంసలు కురిపించారు.