మనిషి ప్రాణం ఎంత విలువైనదని తెలిసినా కొంత మంది నిర్లక్ష్యం.. తొందరపాటు వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కదులుతున్న రైలు ఎక్కడం.. దిగడం వల్ల ఫ్లాట్ ఫామ్ పై పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్నిసార్లు అదృష్టం కొద్ది ఇలాంటి ప్రమాదాల నుంచి రైల్వే సిబ్బంది.. తోటి ప్రయాణీకులు బాధితులను రక్షించిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఇది చదవండి: షోలో నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన జబర్దస్త్ వర్ష!
కదులుతున్న లోకల్ రైలు ఎక్కుతుండగా ప్రయాణికుడు జారి పడిపోయాడు. అది గమనించిన రైల్వే పోలీసు కానిస్టేబుల్ నేత్రపాల్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని వడాలా రైల్వే స్టేషన్లో జరిగింది. ఘటనకు సంబంధించిన క్లిప్ను సెంట్రల్ రైల్వే ట్విట్టర్లో షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
#WATCH | Maharashtra: Railway Protection Force (RPF) constable Netrapal Singh saved the life of a passenger by saving him from falling into the gap between the platform and the train at Wadala station in Mumbai today.
(Video source: Central Railway PRO) pic.twitter.com/N2wCKvUWsb
— ANI (@ANI) March 13, 2022