కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ కార్డియాక్ అరెస్ట్తో ఇటివల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. చనిపోక ముందు తన కళ్ల దానం కోసం అంగీకరించిన పునీత్ రాజ్కుమార్ చాలామందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మరణాంతరం ఆయన కళ్లను సేకరించిన వైద్యులు వాటిని కంటిచూపు లేనివారికి అమర్చారు. సాధారణంగా అయితే ఒకరి కళ్లుతో ఇద్దరికి మాత్రమే కంటిచూపు దక్కుతుంది.
కానీ పునీత్ కళ్లలోని కార్నియాలను వేరు చేసి నలుగురికి శస్త్రచికిత్స చేసి కంటిచూపు వచ్చేలా చేశారు వైద్యులు. ఇలా పునీత్ దానం చేసిన కళ్లతో ఏకంగా ఒకే రోజు నలుగురు వ్యక్తులు ఈ లోకాన్ని చూడగలిగారు. సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్న పునీత్ రాజ్కుమార్ ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో అంతుకుమించి అభిమానం పొందారు. ఇప్పుడు చనిపోయినా తర్వాత కూడా తన కళ్లతో నలుగురి జీవితాల్లో వెలుగు నింపారు.
ఇదీ చదవండి: పునీత్ రాజ్ కుమార్ చివరి చూపుకు తమిళ హీరోలు ఎందుకు రాలేదు?