పెట్రోల్, డీజిల్ వాహనాలు కాలుష్యానికి కారణమవుతుండటంతో పాటు ఇంధన ధరలు పెరుగుతుండటంతో.. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి రాయితీలు కూడా ప్రకటిస్తున్నాయి. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. ఎలక్ర్టిక్ వాహనాలు కాలిపోవడం లేదా పేలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓలా ఎస్1 ప్రో ఎలక్ర్టిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అయితే ఈఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన పూణే లోని ధనోరి ప్రాతంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
శనివారం పూణెలోని ధనోరి ప్రాంతంలో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. రోడ్డు పక్కన పార్క్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. ఇంతలో స్థానికులు కొందరు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆస్కూటర్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై ఓలా సంస్థ స్పందించింది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లో అగ్ని ప్రమాదాన్ని సదరు సంస్థ ధృవీకరించి, మంటలు చెలరేగడానికి గల కారణాలను పరిశీలిస్తోంది. ఈ సంఘటనకు గల కారణాన్ని తాము పరిశోధిస్తున్నామని సదరు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నికి ఆహుతి అయ్యే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
WATCH | Ola S1 pro electric scooter catches fire in Pune, company says will take appropriate action #OlaElectric #OlaS1 #Pune #EV #electricvehicle @OlaElectric @Olacabs pic.twitter.com/xaJ5zsBgYQ
— ET NOW (@ETNOWlive) March 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.