టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రపుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. భారత దేశం గర్వించే విధంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు నీరజ్ చోప్రా. బంగారు పతకం సాధించిన ఒక్కరోజులోనే అతని సోషల్మీడియా అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. పలు కంపెనీలు తమ కంపెనీలకు నీరజ్ను బ్రాండింగ్ చేయడం కోసం క్యూ కట్టాయి.
తాజాగా ఈ కుర్ర ఆటగాడు.. మరోసారి ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తనలోని నటుడిని నెటిజన్లకు పరిచయం చేశాడు. తాజాగా నీరజ్చోప్రా ఐపీఎల్-14 యాడ్స్లో తళ్లుక్కున మెరిశాడు. 23 ఏళ్ల జావెలిన్ త్రోయర్ నీరజ్ ప్రముఖ ఇండియన్ ఫిన్టెక్ కంపెనీ క్రెడ్ రూపొందించిన యాడ్స్లో కన్పించాడు. ఈ యాడ్లో భాగంగా నీరజ్ చోప్రా.. రిపోర్టర్గా, మార్కెటింగ్ మెనేజర్, బ్యాంక్ ఉద్యోగి, స్పోర్ట్ పర్సన్, డైరక్టర్గా వివిధ పాత్రల్లో కన్పించాడు.
ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో క్రెడ్ ‘గ్రేట్ ఫర్ ది గుడ్ క్యాంపెయిన్’ పేరిట ఈ యాడ్ను రూపొందించింది. ఈ యాడ్ చూస్తుంటే.. అసలు అతడు నీరజ్ చోప్రానేనా అనేంతగా మారిపోయాడు. ఇప్పుడు ఈ ప్రకటన వీడియో వైరల్ అవుతోంది. తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ యాడ్ను చూసిన నెటిజన్లు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలోనే కాదు..యాక్టింగ్లో కూడా గోల్డ్ మెడల్ కొట్టేశావని నెటిజన్లు పేర్కొన్కారు. ఈ యాడ్ నీరజ్ చోప్రాతో పాటు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు షేర్ చేశారు.
360 Degree Marketing! @cred_club #ad pic.twitter.com/RmjWAXERxm
— Neeraj Chopra (@Neeraj_chopra1) September 19, 2021