జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. చిన్న వయసులోనే తన ప్రతిభను చాటుకుంటు బంగారు పథకాలు సాధిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన ఆ కుర్ర ఆటగాడు తన ఖాతలో మరో సరికొత్త రికార్డు సృష్టించాడు.
ప్రతి ఈవెంట్కూ మెరుగువుతున్న అతడు స్టాక్హోమ్ డైమండ్ లీగ్లోనూ అద్భుతమైన ప్రదర్శనతో మెరిశాడు. నీరజ్ చోప్రా డైమండ్ లీట్ మీట్లో జాతీయ స్థాయి రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో తన పేరున ఉన్న జాతీయ రికార్డు బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి రజతం సాధించాడు. ఇక గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.31 మీటర్ల బెస్ట్ త్రోతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు.
స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో గురువారం జరిగిన పోటీలో పాల్గొన్న నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే 89.94 మీటర్ల త్రో చేశాడు. ఆ తర్వాత వరుసగా తన ఆటతీరును మెరుగు పర్చుకంటూ త్రోలు వేశాడు. ఇక స్వర్ణ విజేత పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా) తన మూడో ప్రయత్నంలో 90.31 మీటర్ల త్రో చేసే వరకు నీరజ్దే అత్యుత్తమ ప్రదర్శన. జర్మనీ ఆటగాడు వెబ్బర్ (89.08మీ) కాంస్యం గెలుచుకున్నాడు. డైమండ్ లీగ్లో నీరజ్కు ఇదే తొలి పతకం. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Olympic gold medallist Neeraj Chopra set a new national record with a throw of 89.94m as he finished 2nd at Stockholm Diamond League
Neeraj’s meet record was broken by Peters Anderson with a throw of 90.31m, as per Sports Authority of India
(Source: Chopra’s Twitter handle) pic.twitter.com/fLRPrtjdHE
— ANI (@ANI) June 30, 2022