పేదలు పస్తులుండకుండా వారి ఆకలి తీర్చడానికి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. కానీ ఇప్పుడు రేషన్ బియ్యానికి బదులుగా నగదును అందించడానికి ఏర్పాట్లు చేస్తుంది. కిలో బియ్యానికి ఇంత చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏ రాష్ట్రంలోనైనా ఇప్పటికి కూడా మూడు పూటలు భోజనం చేసే స్థోమత లేని పేదవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారికోసం ప్రభుత్వం రేషన్ బియ్యాన్నిచ్చి ఆదుకుంటుంది. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తాయి. రేషన్ పంపిణీ విధానం అనేది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇదే విధంగా ఓ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులను ఇవ్వనున్నట్టుగా తెలిపింది. పేదల ఆకలి తీర్చాల్సిన ప్రభుత్వం బియ్యానికి బదులుగా డబ్బులను ఎందుకు ఇస్తుంది? దీనికి గల కారణాలేంటి? అసలు కిలోకి ఎంత చొప్పున ఇస్తారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పేదల కనీస అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వాలు కొంత కృషి చేస్తున్నాయి. నిరుపేదలను ఆదుకోవడానికి పలు రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రభుత్వాలు వారికి అండగా నిలుస్తున్నాయి. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా వారి మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని, మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణమని, అదే విధంగా అన్న భాగ్య పథకంతో బిపిఎల్ కార్డు దారులకు ఒక్కరికి పది కిలోల బియ్యాన్ని ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. అయితే అన్న భాగ్య పథకం జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నది.
రేషన్ కార్డు దారులకు అందించేందుకు సరిపడా బియ్యం నిల్వలు లేకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యానికి బదులుగా నగదు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎఫ్ సిఐ ధరల ప్రకారం కిలో బియ్యానికి రూ. 34 చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ విధమైన నగదు పంపిణీ రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయడానికి సరిపడా బియ్యం నిల్వలు సేకరించేంత వరకు నగదు చెల్లించనున్నట్లు మంత్రి హచ్ కె పాటిల్ తెలిపారు. జూలై 1 నుంచి నగదును రేషన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.