ఇటీవల కొంతకాలం నుంచి వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. వీటి దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరేందరో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలా గ్రామాల్లో తిరిగే వన్య మృగాలను అటవీ అధికారులు పట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇలా మృగాలను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోనులో సామాన్యులు కూడా చిక్కుకుంటారు. తాజాగా అలాంటి ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో గ్రామాల్లో, వ్యవసాయ పొల్లాలో వన్యమృగాల సంచారం ఎక్కువైంది. పులు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటివి గ్రామాల్లోకి వచ్చి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అంతేకాక వీటి దాడిలో పలువురు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఇదే సమయంలో గ్రామాల్లోకి వస్తున్న చిరుతపులి వంటి వాటిని పట్టుకుని అటవీ అధికారులు అడవుల్లో వదిలేస్తుంటారు. అయితే వీటిని పట్టుకునే క్రమంలో బోనులు వంటి వాటిని ఎంతో పటిష్టంగా ఏర్పాటు చేస్తారు. అయితే కొందరు తమ అమాయకత్వం కారణంగా పులికి బదులు వారు బోనులో ఇరుక్కుపోతారు. అలాంటి ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. కోడిని దొంగిలించబోయి ఓ వ్యక్తి చిరుతపులి కోసం ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ లో బులంద్ షహర్ లో వింత ఘటన జరిగింది. బసెందువా గ్రామ పరిసర ప్రాంతంలో కొద్ది రోజులుగా ఓ చిరుతపులి సంచరిస్తుంది. దీంతో స్థానిక ప్రజలు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. అంతేకాక తమ ప్రాంతంలో తిరిగే పులిని పట్టుకోవాలని అటవీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో బసెందు గ్రామంలో సంచరిస్తున్న ఆ చిరుతపులిని బంధించేందుకు అధికారులు బోను ఏర్పాటు చేశారు. చిరుతపులి కోసం ఏర్పాటు చేసిన బోనులో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. అధికారులు పులిని పట్టుకునేందుకు ఓ కోడిని ఎరగా వేశారు.
అయితే బోనులో ఉన్న కోడిని దొంగిలించాలని ఆ వ్యక్తి భావించాడు. అలా పులి కోసం ఎరగా వేసిన కోడిని చోరీ చేసేందుకు యత్నించి.. ఆ దొంగ బోనులో చిక్కుకున్నాడు. కోడిని దొంగిలించే క్రమంలో బోనుకు ఏర్పాటు చేసిన వైర్ తగలడంతో డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి బోనులోనే ఉండిపోయాడు. బోనులో నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే బయటకు రావడానికి వీలులేకపోవడంతో బోనులోనే భోరున విలపించాడు. అతడి ఏడుపులు విన్న సమీపంలోని గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు.
బోనులో ఉండిపోయినా అతడిని బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు బోను తలుపు తెరచి.. అతడిని బయటకు తీశారు. అతడు చేసిన పనికి కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు నవ్వుకున్నారు. ప్రస్తుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.