చాలా మందికి జంతువులను, పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. వారి వారి ఇష్టాన్ని బట్టి వివిధ రకాల జంతువులను, పక్షులను తెచ్చుకుని తమ ఇంటిలో పెంచుకుంటారు. కుక్కలను, పిల్లులను, కుందేలు, రామచిలుకలు, నెమళ్లను.. ఇలా తమకు నచ్చిన జంతువులు ఇష్టంగా పెంచుకుంటారు. మరికొందరు అయితే ఏకంగా పులులను, సింహాలనే పెంచుకుంటారు. అయితే ఇలా జంతువు ప్రేమికులు చేసే ఈ పని కొన్ని సార్లు వారికి చిక్కులు తెచ్చి పెడుతుంది. తాజాగా ఓ వ్యక్తి నెమళ్లను పెంచుకోవడమే తప్పు అయింది. చివరికి అతడిని చిక్కులోకి పడేసింది. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలోని కామేగౌడనహళ్లి అనే గ్రామానికి చెందిన వ్యక్తి మంజూ నాయక్. అతడికి మూగ జీవాలు అంటే ఇష్టం… నెమళ్లు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో కొన్ని నెమళ్లను తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. ఈ సమాచారం వన్యప్రాణాలు సంరక్షణ అధికారులకు చేరింది. దీంతో వారు మంజూ నాయక్ ఇంటి పై దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. అక్కడ ఉన్న నెమళ్లను స్వాధీనం చేసుకున్నారు. భారత వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం నెమళ్లు రక్షిత జంతువుల జాబితాలో ఉంటాయి. వాటిని వేటాడటం, హింసించడం, అనుమతి లేకుండా పెంచుకోవడం వంటివన్నీ నేరంగా పరిగణించబడతాయి. ఈ క్రమంలోనే మంజూ నాయక్ అనుమతి లేకుండా నెమళ్ల పెంచాడు.
అందుకు అతడిపై కేసు పెట్టి అరెస్టు చేశామని.. కోర్టు రిమాండ్ మేరకు జైలుకు తరలించామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గతంలోనూ ఏడుగురు చిలక జోస్యులను అరెస్టు చేశారు. వన్య ప్రాణుల చట్టం ప్రకారం రామ చిలుకలు కూడా రక్షిత జంతువులే. అతిచిన్న పెట్టెల్లో రామ చిలుకలను బంధించడంతో వాటి రెక్కలు, కాళ్లు విరుగుతున్నాయని పెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.