Muslim Man: మత వివాదాలు అలజడి సృష్టిస్తున్న కర్ణాటకలో ఓ ముస్లిం వ్యక్తి మత సామరస్యాన్ని చాటాడు. తన రిటైర్మెంట్ డబ్బులతో వినాయకుడి గుడి కట్టించటమే కాకుండా, పూజారిని ఏర్పాటు చేసి నెలనెల జీతం కూడా ఇస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని, చామరాజనగరం జిల్లా చిక్కహోల్కు చెందిన పీ రెహమాన్ అనే వ్యక్తి 2018లో చిక్కహోల్ రిజర్వాయర్ గేట్ ఆపరేటర్గా పనిచేసేవాడు. ఓ రోజు అక్కడికి దగ్గరలోని ఓ చిన్న గుడిలోంచి వినాయకుడి విగ్రహం కనిపించకుండాపోయింది. ఆ గుడి, గుడిలోని విగ్రహం రెహమాన్కు బాగా తెలుసు. అతడు పని చేసే ప్రాంతానికి అవి గుడి దగ్గరగా ఉండటంతో కొన్నేళ్లుగా చూస్తూ ఉన్నాడు. అయితే, పోలీసులు ఎంత వెతికినా విగ్రహం దొరకలేదు. ఓ రోజు అతడికి ఓ వింత కల వచ్చింది.
తనకు ఓ గుడి కట్టించమని వినాయకుడు అతడ్ని ఆదేశించాడు. రెహమాన్ రోజులు గడుస్తున్నా ఆ కలను మర్చిపోలేకపోయాడు. కొన్ని నెలల తర్వాత ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. రిటైర్మెంట్, గ్రాట్యుటీ డబ్బులతో అదే ఊర్లో వేరే చోట ఓ చిన్న వినాయకుడి గుడి కట్టించాడు. గుడిలో పూజారిని పెట్టించి, అతడికి నెలకు నాలుగు వేల రూపాయల జీతం ఇస్తున్నాడు. అది కూడా తన పింఛన్ డబ్బులనుంచి. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ నేను 2018లో రిటైర్ అయ్యాను. అప్పుడే ఆ వినాయకుడు నా జీవితంలోకి వచ్చాడు. మాకు ఆయన అల్లా లాగా.. మిగిలిన వాళ్లకు వినాయకుడు. అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. మరి తేడా ఎక్కడుందో అర్థంకాదు’’ అని అన్నాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పాడెపై శవంలా ఆలయానికి వచ్చిన భక్తుడు! ఎందుకంటే..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.