కాలేజీలో కరెంటు లేక విద్యార్థులు కార్ల వెలుతురులో పరీక్ష రాసిన సంఘటన బిహార్లో జరిగింది. సిబ్బంది వైఫల్యం కారణంగా దాదాపు 400 మంది 12వ తరగతి(ఇంటర్మీడియట్) విద్యార్థులు కార్ల హెడ్ లైట్ల వెలుతురులో పరీక్ష రాశారు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి పరిధిలో గల మహారాజా హరేంద్ర కిశోర్ సింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి పరీక్ష హిందీని రెండు భాగాలుగా నిర్వహించారు. ఫస్ట్ పేపర్ పరీక్ష ఉదయం జరగ్గా.. రెండో పేపర్ షెడ్యూల్ను మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. అయితే పరీక్షా కేంద్రంలో ముందస్తుగా సీటింగ్ ఏర్పాట్లు చేయకపోవడంతో గందరగోళం తలెత్తింది. దీంతో కేంద్రం వద్ద నిరసనలు, గందరగోళం చెలరేగడంతో పోలీసులను రంగంలోకి దించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు.
సాయంత్రం 4.30 గంటల వరకు కూడా విద్యార్థులకు జవాబు పత్రాలు అందలేదని ఆరోపించారు. చాలా ఆలస్యంగా మొదలైన పరీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. అప్పుడే అసలు సమస్య మొదలైంది. కాలేజీకి ఎలాంటి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అవసరమైనప్పుడు జనరేటర్లతో నడిపించేవారు. అయితే కొన్ని గదుల్లో ఆ సౌకర్యం కూడా లేకపోవడంతో, కొంతమంది విద్యార్థులను కారిడార్లలో కూర్చోబెట్టారు. కానీ అప్పటికే చీకటి పడింది. దీంతో కార్లలో వచ్చిన కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు హెడ్లైట్లు ఆన్ చేయడంతో ఆ వెలుతురులో విద్యార్థులు పరీక్ష పూర్తిచేశారు.ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో రావడంతో ఇది వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన ఈస్ట్ చంపారన్ జిల్లా కలెక్టర్.. దర్యాప్తు కోసం జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో కమిటీని నియమించినట్లు తెలిపారు. దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
गाड़ियों की ‘लाइट’ में परीक्षा!एक तो समय पर प्रश्न पत्र नहीं मिला… और जब मिला तो सवाल हल करते-करते परीक्षा केंद्र पर अंधेरा हो गया. फिर क्या… गाड़ियों की लाइट जलाई गई और उसके बाद छात्र इस जुगाड़ तकनीक के सहारे इंटरमीडिएट की परीक्षा दे सके.मोतिहारी से अरविंद की रिपोर्ट. pic.twitter.com/wA7geX53Z7
— Prakash Kumar (@kumarprakash4u) February 2, 2022