దేశంలో కరోనా కట్టడిలో భాగంగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 131.99 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కరోనా కట్టడి చేయడానికి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతుంటే.. కొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.. లేనిపోని అపోహలతో భయపడిపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎంత అవగాహన చేపట్టినా వారిలో మార్పు రావడం లేదు. కొన్ని రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొన్ని నజరానాలు, బహుమతులు ప్రకటిస్తున్నాయి. అయితే దీన్ని కొంత మంది సైబర్ కేటుగాళ్లు వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
టీకా తీసుకుంటే బహుమతులు, నజరానాలు, క్యాష్బ్యాక్లు అందిస్తామంటూ వివిధ ఆఫర్లను ప్రకటిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టీకా తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు ఉచితంగా రీఛార్జ్ సౌకర్యం కల్పిస్తుందట. జియోతో పాటు ఎయిర్టెల్, వొడాఫోన్- ఐడియా వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని, డిసెంబర్ 20 వరకు ఈ అవకాశం ఉందన్న ప్రకటనతో పాటు కొన్ని లింక్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనల్లో ఏ మాత్రం నిజంలేదని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని చూసి ప్రజలు ఎవరూ మోసపోవొద్దని సూచించింది. ఈ పోస్టులు, ప్రకటనలు అన్నీ ఫేక్ అంటూ తెలిపింది. అంతే కాదు ఇలాంటి ప్రకటనలు చూసి వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది. ఇదిలా ఉంటే.. సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) కూడా ట్విట్టర్ వేదికగా ఈ పోస్టుపై స్పందించింది.‘ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం లేదా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఎలాంటి ఆఫర్లు వెలువడలేదు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను, సన్నిహితులను కూడా అప్రమత్తం చేయండి’ అని ట్వీట్లో రాసుకొచ్చింది.
दावा:देश में रिकॉर्ड वैक्सीनेशन होने की खुशी में भारत सरकार सभी भारतीय यूज़र्स को 3 महीने का रिचार्ज फ्री में दे रही है#PIBFactCheck
☑️भारत सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गयी है
☑️ऐसे किसी फर्जी मैसेज के लिंक पर अपनी कोई निजी जानकारी साझा न करें और न ही इन्हें फॉरवर्ड करें pic.twitter.com/Hln90XTlyM— PIB Fact Check (@PIBFactCheck) December 10, 2021