దేశంలో ఎన్నికల సందడి మొదలైందంటే.. రాజకీయ నాయకుల్లో టెన్షన్ మొదలవుతుంది. గెలుపు లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష నేతలు ఎన్నో రకాల వ్యూహాలతో ప్రజల మద్దతు కోసం వెళ్తుంటారు.
ప్రతి ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికలు రాజకీయ నాయకులకు కీలకంగా ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షాల మధ్య పోరు మొదలైతుంది. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మొదలు పెట్టింది. వివరాల్లోకి వెళితే..
ఈ సంవత్సరం చివర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు(తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం)కు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం పోస్టుల్లో 3 ఏళ్ల సర్వీదాటిన ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలని అదేశించింది. అలాగే కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికారులను బదిలీ చేయాలని సూచించింది. ఇక ఇన్స్ పెక్టర్లు, సబ్ ఇన్స్ పెక్టర్లకు వారి సొంత జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వకూడదు అని సీఈసీ ఆదేశాలు జారీచేసింది. దీనికి కారణం ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో బంధుత్వాలు వారి నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సని సీఈసీ ఆదేశించింది.
ఈ ప్రక్రియ జూలై 31 లోపు మొదలు కావాలని.. బదిలీల పూర్తి చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఇక అధికారుల్లో ఎవరైనా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారు ఉంటే.. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశిచింది. అంతేకాదు గతంలో ఈసీ చర్యలు తీసుకున్న వ్యక్తులను విధులకు హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాగా, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.