ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం ఒకటి. లక్షల కోట్ల ఆస్తి కలిగిన అంబానీ కుటుంబం నిత్యం అత్యంత విలాసవంతంగా జీవితాన్ని గుడుపుతూ ఉంటుంది. ముఖ్యంగా గ్రోసరీస్ విషయంలో..
దేశంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం ముఖేష్ అంబానీ కుటుంబం. ఈ విషయం అందరికీ తెలిసిందే. వారి జీవన విధానం చాలా విలాసవంతమైనది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులను వీరు రోజువారీగా ఉపయోగిస్తుంటారు. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ, కొడుకు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల కార్లు, బ్యాగులు.. ధరించే దుస్తులు, తాగే టీ కప్పుల నుండి ప్రతి వస్తువు అత్యంత ఖరీదైనవిగా తరచూ వార్తల్లో వింటుంటాం. ఇప్పుడు అంబానీ కోడలు ధరిస్తున్న నెక్లెక్కు సంబంధించి ఓ వార్త బయటికొచ్చింది. ముఖేష్, నీతా అంబానీల ముద్దుల కొడుకు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా ప్రపంచంలోనే అత్యంత విలువైన, ఖరీదైన నెక్లెస్ కలిగి ఉన్నారు.
ఈ నెక్లెస్ ధర అక్షరాలా 450 కోట్ల రూపాయలు. ఇంతటి విలువైన నెక్లెస్ ను కోడలు శ్లోకా మెహతాకు నీతా అంబానీ గిఫ్ట్ గా ఇచ్చింది. కాగా, శ్లోకా మెహతా దేశంలోనే పేరుగాంచిన వజ్రాల వ్యాపారి రాసెల్ మెహతా కూతురు. అంబానీ, రాసెల్ మెహతా కుటుంబానికి గతంలో వ్యాపార సంబంధాలు ఉండేవి. తర్వాత రాసెల్ మెహతా కూతుర్ని అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీతో వివాహం జరిగింది. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా తమ విద్యను ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూలో పూర్తి చేశారు. ఆ తర్వాత వీరి పరిచయం పెళ్లివరకు వెళ్లింది. పెద్దల సమ్మతితో ఇద్దరూ ఒక్కటయ్యారు. మరి, 450 కోట్ల విలువైన శ్లోకా నెక్లెస్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.