ఓ వార్త ఇప్పుడు ముంబై పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ పాఠశాలకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మంగళవారం సాయంత్రం పాఠశాలకు చెందిన ల్యాండ్ లైన్ కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. స్కూల్ లో బాంబు పెట్టామని.. పేల్చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు.
వెంటనే ఆ అజ్ఞానత వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. కంగారు స్కూల్ సిబ్బంది బాంద్రా కుర్లా పోలీసులకు సమాచారం అందజేశారు. అప్పమత్తమైన పోలీసులు స్కూల్ లో తనిఖీలు చేశారు. వారికి పాఠశాలలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఆ విషయం తెలుసుకుని స్కూల్ సిబ్బంది, స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కాల్ ట్రేసింగ్ లో మునిగిపోయారు. ఆ అజ్ఞాత కాలర్ వివరాలు తెలియగానే వెల్లడిస్తామని తెలిపారు.
గతంలో కూడా పాఠశాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ లో హర్ కిసాన్ ఆస్పత్రికి కూడా ఇలాంటి గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేసి బాంబు పెట్టామని బెదిరించాడు. అప్పుడు పోలీసులు కాల్ ట్రేస్ చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 2020లో అంబానీ కుటుంబానికి కూడా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఆంటిలియా వద్ద పేలుడు పదార్థాలతో స్కారియోని పార్క్ చేశారు. తర్వాతి నుంచి కేంద్రం అంబానీ కుటుంబానికి భద్రతను కట్టుదిట్టం చేసింది.
A case under Sections 505 (1)(B) and 506 of IPC registered after Dhirubhai Ambani school in Bandra Kurla Complex area received a bomb threat call yesterday at around 4.30pm. The caller has been identified and will be arrested soon: Mumbai Police
— ANI (@ANI) January 11, 2023