చాలా మంది తమ నగదు, నగలకు ఇళ్లల్లో భద్రత ఉండదనే ఉద్దేశంతో బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు బ్యాంకులోని నగదూ సేఫ్ గా ఉంటుందనే గ్యారెంటీ ఇవ్వలేం. అలాంటి ఘటనలు అనేకం చూశాం. తాజాగా..
ప్రతి మనిషికి డబ్బుపై ఆశ అనేది ఉంటుంది. ధనంపై వ్యామోహం లేనివారు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తుంటారు. బాగా సంపాదించుకుని జీవితంలో స్థిరపడాలని కోరుకుంటారు. అలా రేయింబవళ్లు కష్టపడి సంపాదించిన సొమ్మును, నగలను బ్యాంక్ లో పెట్టుకుంటారు. అందుకు కారణం.. ఇంతలా కష్టపడి కూడబెట్టిన సొమ్మును దొంగలు ఎత్తుకెళ్తారని భయం. బ్యాంక్ లో అయితే భద్రంగా ఉంటుందనే నమ్మకం. ఇలా కేవలం సామాన్యులే కాకుండా ధనవంతులు సైతం తమ నగలు, డబ్బులను బ్యాంక్ లాకర్లలో భద్రత పరుచుకుంటారు. అలానే ఓ కస్టమర్ కూడా తన సొమ్మును ఓ బ్యాంక్ లాకర్ లో దాచిపెట్టి.. చాలా రోజుల తరువాత ఇటీవల తీసుకోవాడానికి అక్కడి వెళ్లాడు. బ్యాంక్ లో తన లాకర్ తెరవగానే అందులోని దృశ్యం చూసి ఒకసారిగా షాకయ్యాడు. మరి.. వినియోదారుడు షాకైన దృశ్యం ఏమిటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ జిల్లా కలాజి గోరాజి ప్రాంతంలో మహేష్ సింఘ్వి అనే వ్యక్తి తన విలువైన వస్తువులను, డబ్బులను స్థానికంగా ఉండే ఓ బ్యాంకులో దాచుకున్నాడు. బంగారం, నగదు, ఖరీదైన వస్తువులు, విలువైన డాక్యుమెట్లు ఇంట్లో ఉంచుకుని ఎటూ వెళ్లలేం అనే ఉద్దేశ్యంతో బ్యాంకు లాకర్ లో భద్రత పరిచాడు. అంతేకాక తన భార్య సునీత మెహ్తా పేరుపైతో రూ.2.15 లక్షల డబ్బులను కూడా అదే లాకర్లో భద్రపరిచాడు. అలానే ఏదైనా శుభకార్యానికి , విహార యాత్రలకు వెళ్లాల్సి వస్తే కూడా తన సొమ్ము భద్రంగా ఉండేందు బ్యాంక్ లాకర్ లో పెట్టాడు. గత ఏడాది మే లో మహేష్.. తన సొమ్మును బ్యాంకు లాకర్ల దాచిపెట్టగా.. ఇటీవల ఫిబ్రవరి 9న తన సొమ్మును బ్యాంక్ నుంచి తిరిగి తెచ్చుకోవాలని భావించాడు.
ఈ నేపథ్యంలో ఇటీవలే బ్యాంక్ కి వెళ్లి.. అక్కడి అధికారులను కలిసి తన సొమ్ము గురించి ప్రస్తావించాడు. అధికారులతో కలిసి తన లాకర్ వద్దకు వెళ్లి.. తెరచి చూశాడు. అలా బ్యాంక్ లాకర్ తెరచి చూడగానే మహేష్, అతని భార్య సునీతతో పాటు అధికారులు షాకయ్యారు. తమ లాకర్ ఓపెన్ చేయగానే నోట్ల కట్టలు పూర్తిగా చెద పురుగులు తిని కనిపించిందని మీడియాతో తెలిపారు మహేశ్ సింఘ్వి. నోట్లు మొత్తం పౌండర్గా మారిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ లాకర్ లో ఉన్న రూ.500 నోట్ల కట్టలను చెద పురుగులు తినేశాయని తెలిపారు. ఆ దృశ్యాని చూసి ఆవేదన చెందిన ఆ దంపతులు బ్యాంకు సిబ్బందితో గొడవకు దిగారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఆ తర్వాత లాకర్ ఓనర్ సునీతా మెహ్తా బ్యాంక్ మేనజర్కి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ లాకర్ లోని నోట్ల కట్టలు చెద పురుగులు తినేశాయనే, ఇతర లాకర్లలోనూ చెద పురుగులు ఉండొచ్చనే ఆలోచన అధికారులకు వచ్చింది. అదే జరిగితే ఇతర లాకర్లలో డబ్బులు పెట్టుకున్న వారు భారీగా నష్టపోతారు. అయితే ఇతర లాకర్లకు చెదలు పట్టిందా? లేదా అని విషయంపై సమాచారం లేదు. ఈ లాకర్ లోకి చెద పురుగులు ఎలా చేరాయనే విషయంపై బ్యాంకు అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము తుక్కు తుక్కుగా మారడంతో ఆ దంపతులు తీవ్రవేదనకు గురవుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.