దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ మద్య కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం కరోనా చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల్లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడించారు.
ఓ సదస్సులో మాట్లాడిన ఆయన పిల్లలకు కొవిడ్ నుంచి రక్షణ కల్పించే కొవొవాక్స్ టీకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని వివరించారు. 3 ఏళ్లు పైబడ్డ పిల్లలందరికీ ఈ టీకాను ఇవ్వవచ్చని తెలిపారు. ఇప్పటికే ‘కోవాక్స్’పేరిట సీరమ్ సంస్థ చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ను మూడు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలపై క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించారు. ఇక అందులో మంచి ఫలితాలు వచ్చాయని ఆదార్ పూనావాలా ఓ పారిశ్రామిక సమావేశంలో తెలిపారు.
ఇప్పటికే భారత్లో రెండు కంపెనీలకు చెందిన కొవిడ్ టీకాలు చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతి పొందినట్లు గుర్తు చేశారు. అదృష్టవశాత్తు చిన్నారుల్లో కొవిడ్ తీవ్రమైన అనారోగ్యం కలిగించడం లేదని పునావాలా అన్నారు.