దేశంలో అడవులు అంతరించి పోతున్నాయి. మనిషి మనుగడ కోసం అడవులను నరికి వేయడంతో ఆహారం దొరకక వన్యప్రాణులు సిటీలు, పల్లెల్లోకి వచ్చేస్తున్నాయి. ఒకచోట అడవిలో వుండాల్సిన చిరుత గ్రామంలో వుంటే.. ఇంకేముంది..? ఆ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా గడిపాల్సి వచ్చింది. పులి గ్రామంలో తిరగడంతో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జడుసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్… లక్నోలో ఓ చిరుతపులి అధికారులను ముప్పుతిప్పలు పెట్టి ఎట్టకేలకు చిక్కింది. మూడు రోజుల కిందట ఆ చిరుతపులి యూపీ రాజధానిలోని చాలా కాలనీలు, వీధుల్లో తిరుగుతూ కనిపించింది. ఆహారం కోసం ఆ చిరుత చీకట్లో వెతుకున్న క్రమంలో ముగ్గురిపై దాడి చేసింది. ఇందులో మిలేకా అనే వ్యక్తితో పాటు అటవీశాఖ ఉద్యోగి కూడా ఉన్నాడు. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాము రెగ్యూలర్ గా తిరిగే విధుల్లో చిరుత తిరగడం చూసి స్థానికులు ఒక్కసారే హడలిపోయారు. అయితే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు రకరకాలుగా దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. అధికారులకు దొరకుండా మూడు రోజుల పాటూ తిప్పలు పెట్టింది. ఎట్టకేలకు అధికారులు చిరుతను బోనులో బంధించగలిగారు. కానీ.. అప్పటికే ఆ చిరుత ఏడుగురిని గాయపరిచినట్లు సమాచారం.
అధికారులు చిరుతను బంధించిన విషయం స్థానికులకు చెప్పినా.. వారిలో భయం మాత్రం ఇంకా భయం పోకపోవడం విశేషం. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎవరైనా వచ్చినా… అన్ని దిక్కులూ చూసుకుంటూ… అడుగు అడుగులోనూ అలర్ట్ అవుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే మోస్ట్ వాటెండ్ చిరుత ఓ కుక్కను చంపి తీసుకు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. చిరుత పులి గేటు నుంచి దూకి.. పెంపుడు కుక్కను క్షణాల్లోనే ఎత్తుకెళ్లిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
See that leopard. Others don’t stand a chance. Via WA. pic.twitter.com/Ha3X9eBwWl
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 24, 2021