స్పెషల్ డే అంటే.. భర్తలు భార్యలకు విలువైన గిఫ్ట్స్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ సెలబ్రిటీల విషయానికి వస్తే.. భర్తలు ఇచ్చే గిఫ్ట్స్ కోట్లలో విలువ చేస్తుంటాయి. తాజాగా తన భార్యకి ఊహించని రేంజిలో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసాడు భారత క్రికెటర్ రోహిత్ శర్మ. ఇటీవలే తన భార్యకోసం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా, తీరప్రాంత పట్టణం అలీబాగ్లో 4 ఎకరాలు ల్యాండ్ కొన్నాడు. ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయి. రోహిత్ శర్మ, అతని భార్య సాక్షులతో పాటు అలీబాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. కొనుగోలు చేసిన భూమి అలీబాగ్ తాలూకాలోని సరళ్ మత్రోలి గ్రామంలో ఉంది.
ఈ 4 ఎకరాల భూమి విలువ దాదాపు రూ.9 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత రోహిత్, రితిక.. కొంతమంది స్నేహితులతో కలిసి భూమిని సందర్శించి పూజలు చేశారు. ఇప్పటివరకు అలీబాగ్ ప్రాంతంలో.. స్టార్ సెలెబ్రిటీస్ షారూఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి మరియు అజిత్ అగార్కర్ వంటి పలువురు గెస్ట్ హౌసులు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులో రోహిత్ కూడా చేరిపోయాడు. అలీబాగ్ ముంబై నుండి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రం ద్వారా, స్పీడ్ బోట్ సహాయంతో, పట్టణంలోని మాండ్వా జెట్టీకి చేరుకోవడానికి సుమారు 25 నిమిషాలు పడుతుందని సమాచారం. మరి ఈ ఇండియన్ స్కిప్పర్ భారీ గిఫ్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.