కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ఎల్ కేజీ సీటు కావాలన్నా ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. గత కొంత కాలంగా ఇక్కడ పలుకుబడి వ్యవహారాలు బాగా నడుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రీయ విద్యాలయం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలకు ఎంపీ కోటా రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవ కాలంలో కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎంపీల కోటాను పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఈ కోటాను రద్దు చేయడం సర్వత్రా చర్చలకు దారి తీసింది.
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశం కోసం ప్రతి సంవత్సరం ఎంపీ కొటాలో పది సీట్లను కేటాయిస్తూ ఉంటారు. ఆ సీట్లను తమకు అనుకూలంగా ఉన్నారికి.. పార్టీకి మద్దతు ఇచ్చేవారి పిల్లకు కేటాయిస్తూ వారు లేఖలు రాయడంపై విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఎంపీలు అయితే పరిమితికి మించి సిఫార్సు లేఖలు పంపుతున్నారు. లోక్సభలోనూ కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై చర్చ జరిగింది. దీని వల్ల సీట్ల కేటాయింపు విషయంలో ఎన్నో సమస్యలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా సైతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రీయ విద్యాలయ ప్రవేశాల్లో ఎంపీ ల కోటా రద్దు చేసినట్లు తెలుస్తుంది. ఇక నుంచి కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలకు పొందడానికి విద్యార్ధులకు ఎలాంటి అన్యాయం జరగదని పలువురు భావిస్తున్నారు.