కాకినాడ జిల్లా వలసపాక కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ దాదాపు 40 మంది విద్యార్ధుల వరకు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరందరిని వలసపాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిన్న టీచర్స్ డే సందర్భంగా కేకు తిన్నట్లు కొంతమంది విద్యార్ధులు చెబుతున్నారు. అయితే కేవలం కేకు వలనే ఇంతమంది విద్యార్ధులు అస్వస్థత గురికావడం జరగదని స్థానికులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చుట్టు కూడా కాలుష్యాన్ని వదిలే కంపెనీలు ఉంటాయి. ఆ గాలి వల్లనే ఊపిరాడక కళ్ల తిరిగి విద్యార్దులు పడిపోయారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను కాకినాడలోని జీజీఎం ఆస్పత్రికి తరలి చికిత్స అందిస్తోన్నారు.
అయితే తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారు. విద్యార్ధుల అస్వస్ధతకు గల కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు రక్త నమూనాలను సేకరించారు. అయితే ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో మంత్రి ఫోన్ లో మాట్లాడారు. ఘటన స్థలానికి ఉన్నతాధికారులను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.