దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మీరు నిరుద్యోగులా..! పెద్ద పెద్ద చదువులు చదివి ఖాళీగా ఉంటున్నారా. అయితే, మీకో గుడ్ న్యూస్. హైదరాబాద్, ఉప్పల్ పరిధిలోని కేంద్రీయ విద్యాలయం వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 7,10న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు కోసం కింద చదవండి.
కాకినాడ జిల్లా వలసపాక కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ దాదాపు 40 మంది విద్యార్ధుల వరకు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరందరిని వలసపాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిన్న టీచర్స్ డే సందర్భంగా కేకు తిన్నట్లు కొంతమంది విద్యార్ధులు చెబుతున్నారు. అయితే కేవలం కేకు వలనే ఇంతమంది విద్యార్ధులు అస్వస్థత గురికావడం జరగదని స్థానికులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చుట్టు కూడా కాలుష్యాన్ని వదిలే కంపెనీలు ఉంటాయి. […]
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ఎల్ కేజీ సీటు కావాలన్నా ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. గత కొంత కాలంగా ఇక్కడ పలుకుబడి వ్యవహారాలు బాగా నడుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రీయ విద్యాలయం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలకు ఎంపీ కోటా రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవ కాలంలో కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎంపీల కోటాను […]