భారత దేశంలో ఇప్పటి వరకు పురావస్తు శాఖ వారు జరిపిన పరిశోధనలు, తవ్వకాల్లో ఎన్నో అద్భుతమైన వస్తువులు బయట పడ్డాయి. పురాతన కాలం నాటి వస్తువులను కనుగొన్నారు. ఆ కాలం నాటి దేవాలయాలు ఎన్నో పురాతన కట్టడాలను తమ పరిశోధనలో కనుగొన్నారు. మన దేశంలో అప్పుడప్పుడు కనీ వినీ ఎరుగని రీతిలో సొరంగాలు బయటపడుతుంటాయి. పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల వల్ల మన పూర్వీకులు చరిత్రలు బయటపడుతున్నాయి. తాజాగా ముంబాయిలో బ్రిటీష్ కాలం నాటి సొరంగం ఒకటి బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ముంబాయిలో జేజే హాస్పిటల్ లో తవ్వకాలు జరుపుతుంటే 132 ఏళ్లనాటి ఒక సొరంగం బయటపడింది. బ్రిటీష్ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజ్ సర్ జేజే గ్రూప్ హాస్పిటల్ ని ప్రస్తుతం జేజే హాస్పిటల్ గా పిలుస్తున్నారు. మొదట్లో ఈ భవనాన్ని ఆసుపత్రికోసం వాడారు.. ప్రస్తుతం మెడికల్ కాలేజ్ గా మార్చారు. ఈ భవనం కిందనే సుమారు రెండు వందల మీటర్ల పొడవైన సొరంగం బయట పడింది. ఇక్కడ ఉన్న శిలాఫలకంపై 1890 లో నిర్మించినట్లు తెలుస్తుంది.
మహారాష్ట్రలో అతి పురాతనమైన కట్టడాల్లో జేజే హాస్పిటల్ ఒకటి. ఈ భవనం నిర్మించిన కొత్తలో మహిళలకు, పిల్లలకు ఇక్కవ వైద్య చికిత్స అందించేవారని చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని కాలేజ్ గా మార్చారు.. కొన్నిరోజులుగా నర్సింగ్ లో వాటర్ లీకేజ్ ఇబ్బంది ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలించడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంజనీర్లు, సెక్యూరిటీ గార్డులు పరిశీలిస్తున్నసమయంలో ఈ సొరంగ మార్గం బయట పడిందని అంటున్నారు. కాగా, సొరంగంపై ప్రాధమిక పరిశోధన వివరాలను కలెక్టర్, పురావస్తు శాఖకు సమర్పిస్తామన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.