వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపు ఆశ్రమంలో ఘోరం చోటు చేసుకుంది. ఆయన ఆశ్రమంలో లోపలున్న కారులో బాలిక మృతదేహం లభ్యమైంది.ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో ఓ ప్రాంతంలో ఈ నెల 5న ఇంటి బయట ఆడుకుంటున్న 14 ఏండ్ల బాలిక అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లి.. ముగ్గురు పొరుగువారిపై అనుమానం వ్యక్తం చేసి కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గోండా జిల్లాలోని బిమూర్ గ్రామంలో ఉన్న ఆశారాం బాపు సేవా కేంద్రంలో ఒక కారు నుంచి దుర్వాసన వస్తుండాన్ని సిబ్బంది గమనించారు. పరిశీలించగా ఆ కారులో బాలిక మృతదేహం ఉంది. దీంతో ఆశ్రమ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆశ్రమానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆశారాం బాపు తనకు తాను దేవుడిగా చెప్పుకునే ఆధ్యాత్మికవేత్త. దేశవ్యాప్తంగా ఆయనకు ఆశ్రమాలున్నాయి. జోధ్ పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై ఆయన అత్యాచారం చేసినట్టు తేలడంతో 2018లో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆశారాం బాపూకి వ్యతిరేకంగా మరెన్నో అత్యాచార, ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జోధ్ పూర్ కారాగారంలో ఆశారం బాపు శిక్ష అనుభవిస్తున్నారు. వివాదాలు రేపడం ఆశారాం బాపునకు ఇదే తొలిసారి కాదు. ఆయనను ఎల్లవేళలా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. భూకబ్జాలు, హత్యా ప్రయత్నం, ఇద్దరు పిల్ల హత్య వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ ఘటనతో ఆశారాం బాపు మరోసారి వార్తల్లో నిలిచారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.