ఇటీవల పలు రాష్ట్రాల్లో మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణించే వసతి కూడా ఏర్పాటు చేశారు.
దేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఆర్టీసీ బస్సుల్లో ఆడవారికి చాలా గౌరవం ఇస్తుంటారు. సీట్లపై స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అని రాసి ఉంటుంది. అంతేకాదు వారికి కొన్ని సీట్లు కూడా కేటాయించి వాటిపై స్త్రీలకు అని రాసి పెడతారు. ఒక్కోసారి పురుషులు స్త్రీలకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇటీవల కొన్నిరాష్ట్రాల్లో స్త్రీలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఇప్పుడు ఓ రాష్ట్రంలో పురుషులకు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం ప్రత్యేక సీట్లు కేటాయించింది. ఇంతకీ ఏ రాష్ట్రం అనుకుంటున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో స్గ్రీలకే కాదు.. పురుషులకు కూడా మంచి రోజులు వచ్చాయి. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు కేటాయించిన సీట్లు అంటూ పెద్ద అక్షరాలతో స్టిక్కర్లు కనిపిస్తుంటాయి. దీంతో కొంతమంది పురుషులు ఎంతదూరమైనా సరే నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు శుభవార్త చెప్పింది. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించిన సీఎం సిద్ద రామయ్య ఇప్పుడు పురుషులకు విషయంలో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు సీట్లు రిజర్వ్ చేసినట్లే ఇకపై పురుషులకు సైతం 50 శాతం సీట్లు రిజర్వ్ చేయనున్నట్లు కర్ణాటక ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల కర్ణాటక ఎన్నికల జరిగిన విషయం తెలిసిదే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యమంత్రిగా సిద్ద రామయ్య పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీ అమలు నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం జూన్ 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు సీద్దరామయ్య ప్రభుత్వం తెలిపింది. కాకపోతే ఏసీ, లగ్జరీ బస్సుల్లో మాత్రం ఈ హామీ నుంచి మినహాయించింది. సీద్దరామయ్య నిర్ణయంపై మహిళలు సంతోషం వ్యక్తం చేయగా.. ఇప్పుడు పురుషులకు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం సీట్లు కేటాయింపు నిర్ణయంపై పురుషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.