హిమాలయ పర్వత ప్రాంతాలు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది మంచు. అలాంటి మంచు ప్రాంతాలలో జనవజీవనం చాలా కష్టం. గడ్డకట్టించే శీతల వాతావరణంలో బతకాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఫుట్ బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఆశ్చర్య పడాల్సిందే. లడఖ్ లోని స్పిటుక్ దగ్గర అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫుట్ బాల్ మైదానాన్ని నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ఫుట్ బాల్ స్టేడియం కావడం గమనార్హం. ఈ స్టేడియం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లకు కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు.
ఇది సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్టేడియం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. 30 వేల మంది ప్రేక్షకులు ఒకేసారి వీక్షించేలా గ్యాలరీలు నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం అంచనా వ్యయం రూ.10.68 కోట్లు. అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం ఫిఫా కూడా లడఖ్ ఫుట్ బాల్ గ్రౌండ్ కు పచ్చజెండా ఊపింది. ఖేలో ఇండియా కార్యాచరణలో భాగంగా మైదానం ఉపరితలాన్ని ఆస్ట్రోటర్ఫ్ తో ఏర్పాటు చేశారు. అంతేకాదు.. స్టేడియాన్ని ట్రాక్ ఈవెంట్ల కోసం ఉపయోగించుకునేందుకు వీలుగా 8 లేన్లతో సింథటిక్ ట్రాక్ లను కూడా పొందుపరిచారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్సించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి.. . రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. విభజన అనంతరం ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగానే ఈ ఫుట్బాల్ స్టేడియం నిర్మాణం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరలవుతోంది. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాకు బహుకరించిన తర్వాత.. ఆ ప్రాంతంలో కనీసం గడ్డి కూడా మొలవదని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం లెహ్ లో ఏకంగా 11 వేల అడుగుల ఎత్తున ఫుట్బాల్ స్టేడియాన్ని నిర్మిస్తోంది. ఇంది రెండు ప్రభుత్వాలకు తేడా అంటూ రెండు ఫోటోలను షేర్ చేస్తున్నారు.
Highest Football Stadium:
Ladakh gets its first football and track & field stadium at a height of over 10,000 feet. @IndiaSports @ianuragthakur pic.twitter.com/lV8ikF66UK
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) February 9, 2022