క్యాష్ రిచ్ లీగ్ గా పేరుగాంచిన ‘ఐపీఎల్‘ టోర్నీ ఎందరో ఆటగాళ్ల జీవితాలలో వెలుగునింపింది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి అగ్ర దేశాల ఆటగాళ్లను కోటీశ్వరులను చేస్తే.. వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల క్రికెటర్లకు జీవితాన్నిచ్చింది. ఈ టోర్నీ నిర్వహించడంపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఇది మాత్రం నిజం. తాజాగా, ఆ మాట మరోసారి రుజువైంది. భారత్త జట్టుకు ఎంపికైనా.. ఇంకా అరంగేట్రం కూడా చేయని ఒక దేశవాళీ ప్లేయర్ కోట్ల ధర పలికాడు. ట్యాక్సీవాలా కొడుకైన అతడు, ఒకప్పుడు సరిగా తిండి కూడా తినలేనటువంటి దుర్భర జీవితాన్ని గడిపాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు..? అతని జీవితం ఎలా సాగింది..? అన్నది ఇప్పుడు చూద్దాం..
బిహార్లో జన్మించి, బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ముఖేష్ కుమార్ జీవితం యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపేదే. అతని జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. అతని తండ్రి టాక్సీ నడిపేవాడు. ఆదాయం వస్తేనే.. వారికి తిండి.. లేదంటే పస్తులుండాల్సిన పరిస్థితి. ఒక్కపూట తిని.. మూడు పూటలా తిన్నా అనుకున్న రోజులు అతని జీవితంలో ఎన్నో ఉన్నాయట. ఈ మధ్యనే జాతీయ జట్టుకు ఎంపికైన ముఖేష్, ఇంకా తుది జట్టు తరుపున బరిలోకి దిగలేదు. కానీ, ప్రాంఛైజీలు తన కోసం పోటీపడేలా చేశాడు. కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడ్డాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతన్ని రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది.
Bihar’s son Mukesh Kumar gets closer to playing the IPL. Son of a taxi driver, Mukesh was born in Gopalganj and has been playing for Bengal. He has been bought for about Rs.5.5 CR by the Delhi franchise.
Well done, Mukesh. Wish you all the best! Cheers! pic.twitter.com/tvyQax5vrf
— Prashant Kumar (@scribe_prashant) December 24, 2022
ముఖేష్ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్తో ఇటీవల మరణించారు. రంజీ ఫైనల్స్కు ముందు ఈ విషాదం చోటుచేసుకుంది. అయినా అతనెప్పుడూ శిక్షణ ఆపలేదు. ఉదయం పూట శిక్షణ పొందుతూనే సాయంత్రం ఆసుపత్రిలో తండ్రి మంచం పక్కన పడుకుని సపర్యలు చేసేవాడు. ఆ కష్టానికి ఫలితం.. దేశానికి ఆడే అవకాశం రూపంలో వచ్చినా.. వారి కష్టాలు తీర్చే దారి మాత్రం ఐపీఎల్ రూపంలో తట్టింది. 29 ఏళ్ల ముఖేష్ కుమార్ 2015లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. లిస్ట్-ఏ కెరీర్లో ఇప్పటివరకు 24 మ్యాచ్లు ఆడిన ముఖేష్.. 5.10 ఎకానమీతో 26 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్లో 23 మ్యాచుల్లో 25 వికెట్లు సాధించాడు. అలాగే.. ఫస్ట్ క్లాస్ కక్రికెట్లో 33 మ్యాచుల్లో 123 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్లో ముఖేష్ 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే 2021-22 రంజీ ట్రోఫీ సీజన్లో 20 వికెట్లు పడగొట్టిన ముఖేష్.. బెంగాల్ తరపున జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ ప్రదర్శనే అతని కోట్లు పలికేలా చేసింది.
Which uncapped player will impress in the upcoming Indian T20 League?#Cricket #Teamindia #IndianT20League #MazaPlay #ShivamMavi #MukeshKumar #KSBharat pic.twitter.com/7uPwANxWRK
— MazaPlay (@maza_play) December 24, 2022