మెగాస్టార్ చిరంజీవి అంటే.. కేవలం ఓ స్టార్ హీరో మాత్రమే కాదు. మంచి మనసున్న మహోన్నత వ్యక్తి కూడా. సమాజం పట్ల ఆయనకి ఉన్న దృక్పధం, సేవా గుణం అందరికీ సాధ్యం అయ్యేది కాదు. కొన్ని దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అద్భుతంగా నడిపిస్తున్నా, కరోనా కష్టకాలంలో సినీ ఇండస్ట్రీ కార్మికులకి అండగా నిలబడ్డా, తన సొంత డబ్బులు రూ.33 కోట్ల ఖర్చు పెట్టి రెండు తెలుగు రాష్ట్రలలో ఆక్సిజన్ బ్యాంక్స్ నెలకొల్పినా.. చిరంజీవికి మాత్రమే సాధ్యం అయ్యింది. ఇంతటి సేవానిరతి ఉంది కాబట్టే ఆయన అందరూ మెచ్చిన అన్నయ్య అయ్యారు. ఇక తాజాగా చిరంజీవి మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. 30 ఏళ్ళ క్రితం తన సినిమాకి కో డైరెక్టర్ గా పని చేసిన వ్యక్తి ఆర్ధిక కష్టాల్లో ఉన్నాడని తెలిసి చిరంజీవి అతన్ని కష్టాన్ని తీర్చాడు.
దర్శకరత్న దాసరి నారాయణరావు కోడైరెక్టర్ ప్రభాకర్ ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. దాసరి తన మొత్తం కెరీర్ లో చిరంజీవితో తీసిన ఒకే ఒక్క చిత్రం లంకేశ్వరుడు. 30 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాకు కో డైరెక్టర్ పని చేశారు ప్రభాకర్. ప్రభాకర్ ఇటీవల `హెల్ప్ లైన్` అనే సినిమాని నిర్మించి తీవ్రంగా నష్టపోయారు. దీంతో.. పిల్లల కాలేజీ ఫీజులు కట్టడం కూడా ఆయనకి కష్టం అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి క్షణాల్లో పిల్లల చదువులు ఆగకుండా చర్యలు తీసుకుని, ప్రభాకర్ కి ఆర్ధిక సహాయం అందించారు.
చిరు చేసిన ఈ సహాయంపై ప్రభాకర్ సైతం మీడియాతో మాట్లాడారు. “మా అబ్బాయికి సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్తయి రెండేళ్లయ్యింది. వాడి సర్టిఫికెట్లు డబ్బు కట్టి తేవాలి. పాపకు బీబీఏ ఫైనల్ ఇయర్ కి వచ్చింది. 2.5 లక్షల ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయగలదు. ఎంత ప్రయత్నించినా డబ్బు ముట్టలేదు. దీంతో సాయం కోసం చిరంజీవిని కలిశాను. 30ఏళ్ల క్రితం లంకేశ్వరుడికి పని చేసినప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నారో.., ఇప్పుడు కూడా చిరంజీవి తనపై అదే ప్రేమను కనబరిచారు. వెంటనే స్పందించి ఫీజు ఏర్పాటు చేశారని ప్రభాకర్ ఆనందంగా చెప్పారు. చూశారు కదా? ఇది మన మెగాస్టార్ మంచి మనసు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.