మెగాస్టార్ చిరంజీవి.. హీరోగా తెరకెక్కిన సినిమా భోళా శంకర్. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో ప్రొడ్యూసర్లు నష్టపోకూడదని తాను తీసుకున్న రెమ్యునరేషన్లో కొంత అమౌంట్ నిర్మాతకు తిరిగిచ్చారట. దీంతో మెగాస్టార్ ని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భోళా శంకర్. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ “వేదాలం” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా కూడా నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో భోళా శంకర్ ఫలితం విషయంలో మెగాస్టార్ చిరంజీవి.. నిర్మాత అనిల్ సుంకర మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే నెగిటివ్ ప్రచారంపై స్వయంగా అనిల్ సుంకర స్పందించారు. “అవన్నీ వట్టి పుకార్లు వాటిని నమ్మకండి, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అందరికీ తెలుసు. ఇలా తప్పుడు ప్రచారం చేయకండి. మెగాస్టార్ నాకు అన్ని విధాల సహకరించే వ్యక్తి , మా ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. దయ చేసి వాటిని చెడగొట్టదు” అని చెప్పుకొచ్చారు అనిల్ సుంకర. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ మంచి మనసు గురించి ఓ మంచి వార్త బయటకు వచ్చింది. ఇక భోళా శంకర్ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తాను తీసుకున్న రెమ్యునరేషన్లో కొంత డబ్బులను చెక్ రూపంలో రిటర్న్ ఇచ్చారని తెలుస్తోంది. ఆయన ఈ సినిమా కోసం 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.
ఈ సినిమా విడుదలకు ముందు ఇన్స్టాల్మెంట్ల రూపంలో 50 కోట్ల వరకూ ఇచ్చారని సమాచారం. అయితే అందులో ఓ చెక్ చిరంజీవి బ్యాంక్ లో వేయకుండా తర్వాత వేద్దామనుకున్నారట. అయితే సినిమా అనుకున్న రేంజ్లో ఆడకపోవడంతో చెక్ను రిటర్న్ ఇచ్చారని తెలుస్తోంది. చిరంజీవి గారిది ఎంతో గొప్ప మనసు, అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు అంటూ.. మెగాస్టార్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హిందీలో భోళా శంకర్ పేరుతో ఆగస్ట్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హిందీలో చిరంజీవికి జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి హిందీలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. చూడాలి మరి హిందీ మార్కెట్లో భోళా శంకర్ ఎలాంటీ రెస్పాన్స్ను దక్కించుకుంటుందో.