కర్ణాటకలో హిజాబ్ రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. యూనిఫామ్ తోనే అందరూ విద్యాలయాలకు రావాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల కాలేజీల్లో హిజాబ్ ధరించిన బాలికలను అనుమతించపోవడంపై దుమారం రేగింది. తాజాగా ఈ వివాదం పై బాలల హక్కుల కార్యకర్త, పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. హిజాబ్ ధరించిన విద్యార్థినులను అనుమంతిచకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ప్రభుత్వ కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో యూనిఫాం ఎలా ఉండాలనేది కళాశాల అభివృద్ధి కమిటీలు నిర్ణయిస్తాయి. అసలు యూనిఫాం అవసరమా, కాదా అనేది ప్రైవేట్ సంస్థలు నిర్ణయించుకోవచ్చు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్తర్వుల అమలులో ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ.., ఉడిపిలోని ఓ కాలేజ్ కి చెందిన విద్యార్థినులు కొందరు తరగతులకు హిజాబ్ ధరించడానికి తమకు అనుమతివ్వాల్సిందిగా కోరారు. కాలేజీ యాజమాన్యం అందుకు అంగీకరించకపోవడంతో.. వారు కాలేజీ బయట నిల్చుని నిరసన తెలిపారు. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఈ వివాదం మలాలా సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
మలాలా యూసఫ్ జాయ్ తన ట్విట్టర్ ద్వారా ఈ వివాదంపై స్పందిస్తూ.. “విద్యా లేక హిజాబ్ ఈ రెండింటిలో ఒకటి ఎంపిక చేసుకోవాలని కాలేజీ మాపై ఒత్తిడి తెస్తోంది. బాలికలను హిజాబ్ తో స్కూల్ కు అనుమతించకపోవడం దారుణం. స్త్రీల పట్ల వివక్ష కొనసాగుతోంది. ముస్లిం మహిళలను చిన్న చూపు చూడటం నాయకులు ఆపేయాలి” అని మలాలా తెలిపారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“College is forcing us to choose between studies and the hijab”.
Refusing to let girls go to school in their hijabs is horrifying. Objectification of women persists — for wearing less or more. Indian leaders must stop the marginalisation of Muslim women. https://t.co/UGfuLWAR8I
— Malala (@Malala) February 8, 2022