వివాహేతర బంధాలు జీవితాలను చిదిమేస్తున్నాయి. కాపురాలను నాశనం చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పుడు ఇలాటి ఘటనే చోటు చేసుకుంది. 6 వ బెటాలియన్ కి చెందిన రాజేశ్ ఇక్కడే హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక రాజేశ్ కి 10 ఏళ్ళ క్రితం స్వప్న అనే మహిళతో వివాహం అయ్యింది. అయితే.., ఈ మధ్య కాలంలో రాజేశ్ బుద్ధి దారి మళ్లింది. తాను ఇంకో పెళ్లి చేసుకుంటానంటూ.. భార్యని వేధించడం మొదలు పెట్టాడు. ఇప్పటికే 10 మంది అమ్మాయిలతో రాజేశ్ ఎఫైర్ నడిపినట్టు తెలుస్తోంది. ఈ అభియోగాలతోనే రాజేశ్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు. అయితే.. భార్య స్వప్న ఎంతగా వేడుకున్నా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమె విసుగు చెందింది. దీంతో.., తన భర్త నీచ బుద్ధిని మీడియా సాక్షిగా బయట పెట్టింది.
తాజాగా తన భర్త వేరే మహిళతో రూమ్ లో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకున్న స్వప్న.. మీడియాని, ఊరిలోని పెద్ద మనుషులను తీసుకుని అక్కడికి చేరుకుంది. తలుపులు తెరిపించి.. లోపల తన భర్తతో ఉన్న మహిళకి దేహశుద్ధి చేసింది. తన భర్తకి కూడా నాలుగు దెబ్బలు తగిలించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. స్వప్న తన భర్తని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.., ఇలాంటి వివాహేతర సంబంధాలను పెట్టుకుని భార్యల జీవితాలను నాశనం చేస్తున్న మగాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.