ముంబై వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ, పుజారా లాంటి హేమాహేమీలను డకౌట్లుగా పెవిలియన్ పంపిన ఈ సంచలన బౌలర్పై ఐపీఎల్ జట్లు అప్పుడే కన్నేసినట్లు సమాచారం. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అతన్ని ఎలాగైన దక్కించుకోవాలని పలు ఫ్రాంచైజ్లు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు కొత్తగా రెండు జట్లు ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొననున్న సంగతి తెలిసిందే. వేలంలో రషీద్ ఖాన్, చాహల్, అశ్విన్తో పాటు ఈ కివీస్ సంచలనం కూడా భారీ ధర పలకనున్నాడు. ఆర్సీబీ, సన్రైజర్స్, పంజాబ్, ముంబై, అహ్మాదాబాద్ ఫ్రాంచైజ్లు అజాజ్ పటేల్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. మెగా వేలానికి ముందే కొత్త ఫ్రాంచైజ్లకు ముగ్గురు చొప్పున ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది.
Special piece of history for @AjazP in Mumbai.
🏏 3rd best figures in TEST HISTORY.
🇳🇿 NZ’s best-ever Test figures.
🌏 First player to take 10 wickets in an innings away from home.#INDvNZ pic.twitter.com/4TyqqXPuRa— BLACKCAPS (@BLACKCAPS) December 4, 2021
దీంతో ఇప్పటికే లక్నో ఫ్రాంచైజ్ రషీద్ ఖాన్ను తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇక అహ్మాదాబాద్ అజాజ్ పటేల్పై గురి పెట్టింది. అతని కోసం ఏకంగా రూ.10 కోట్లు కూడా వెచ్చించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ స్పిన్నర్ను ఎలాగైన వేలానికి ముందే తమ జట్టులో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు, అందుకోసం పటేల్తో చర్చల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి అజాజ్ కోసం ఐపీఎల్ జట్లు పోటీ పడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.