భారత్ పేరు వినగానే చిర్రు బుర్రులాడే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వరం మార్చారు. మొదటిసారి భారతదేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్థాన్ లోని ఖైబర్- షఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్ లో బహిరంగ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ మాట్లాడుతూ ‘రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకోవడంలో స్వతంత్ర విదేశీ విధానం అనుసరిస్తున్నందుకు.. మన పొరుగు దేశాన్ని నేను అభినందిస్తున్నాను. క్వాడ్ కూటమిలో భాగస్వామిగా ఉన్న భారత్.. అమెరికా వద్దన్నా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకొంది. మేం కూడా మా దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాం. నేను ఎవరికీ తల వంచను, నా ప్రజలను తల వంచనివ్వను’ అంటూ ఆవేశ పూరిత ప్రసంగం చేశారు. ప్రతిపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ప్రజా మద్దతు కూడగట్టేందుకు ర్యాలీలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రముఖ నటుడి సోదరుడు అరెస్ట్..!
విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలను బహిరంగ ర్యాలీల్లో చర్చించకూడదనే సంప్రదాయాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ విస్మరించారు. యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా తమ మద్దతు కోరిన ఈయూ మాటలకు తాను ఒప్పుకోలేదని చెప్పారు. అలా అడగటం ద్వారా వాళ్లు ప్రొటోకాల్ తప్పారంటూ వ్యాఖ్యానించారు. ఈయూ మాట విన్నంత మాత్రాన తమకు ఒరిగేది ఏమీ లేదని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨 “India is a part of QUAD with US, yet they are importing Oil from Russia, this is India’s foreign policy”: Pak PM Imran Khan pic.twitter.com/0KsOBPqAJg
— OSINT Updates 🚨 (@OsintUpdates) March 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.