న్యూజిలాండ్తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. స్వదేశంలో జరుగనున్న రెండు టెస్టులకు 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. విరాట్ కోహ్లికి మొదటి మ్యాచ్కు విశ్రాంతి ఇస్తూ కెప్టెన్గా అజింక్య రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఛతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్గా నియమించారు. ఈ సిరీస్తో శ్రేయస్ అయ్యర్కు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. కాగా మూడు టీ20 మ్యాచ్ల తర్వాత.. నవంబరు 25 నుంచి డిసెంబరు 7 వరకు టీమిండియా కివీస్తో రెండు టెస్టులు ఆడనుంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్టు ఆడనున్నాడు.
భారత జట్టు:
అజింక్య రహానే(కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా(వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, విరాట్ కోహ్లి.
#TeamIndia squad for NZ Tests:
A Rahane (C), C Pujara (VC), KL Rahul, M Agarwal, S Gill, S Iyer, W Saha (WK), KS Bharat (WK), R Jadeja, R Ashwin, A Patel, J Yadav, I Sharma, U Yadav, Md Siraj, P Krishna
*Virat Kohli will join the squad for the 2nd Test and will lead the team. pic.twitter.com/FqU7xdHpjQ
— BCCI (@BCCI) November 12, 2021