దేశ ప్రథమ పౌరుడు, 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ప్రాంగణం, అసెంబ్లీ ఆవరణలో ప్రారంభమైన ఓటింగ్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా.. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించకుంటున్నారు. ఇక ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ తరఫున ద్రౌపది ముర్ము.. బరిలో నిలవగా.. విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా పోటీలో నిలిచారు. అయితే రాష్టప్రతి ఎన్నిక.. మిగతా వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓట్లు వేసే ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటుకు ప్రత్యేక విలువ ఉంటుంది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఒక్కో తెలంగాణ ఎమ్మెల్య ఓటు విలువ 132 కాగా.. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది. మరి రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువలో ఈ తేడా ఎందుకు.. అసలు ఎమ్మెల్యే ఓటు విలువను ఎలా గణిస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రాష్టపతిని ఎన్నుకలో ఎలక్ట్రోరల్ కాలేజి సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఎలక్ట్రోరల్ కాలేజిలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉంటారు. 1992 లో 72 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించారు. దీన్ని భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
ఓట్ల విలువ..
ఎలక్ట్రోరల్ కాలేజిలో మొత్తం ఓట్ల విలువ = 10,98,990. అందులో 50 శాతం ఎంపిలకు, 50 శాతం ఎమ్మెల్యేలకు ఉంటుది. ప్రస్తుతం ఎలక్ట్రోరల్ కాలేజిలో 776 (543+233) మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు.
ఎమ్మెల్యేల ఓట్ల విలువ..
1.ఎమ్మెల్యేలకు మాత్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటుంది.
2.దీన్ని నిర్ణయించడానికి 1971 జనాభా లెక్కను ప్రాతిపదికన తీసుకుంటారు.
3.1971 నాటి మొత్తం జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు. దానిని వేయితో భాగిస్తారు.
ఉదాహరణ:
1.తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభా (1971 జనాభా లెక్కల ప్రకారం) 1,56,02,122.
2.దీన్ని 119 ఎమ్మెల్యేలతో భాగించగా 131950.650 వస్తుంది.
3.దాన్ని 1000 తో భాగిస్తే 131.95 వస్తుంది.
4.దీన్ని ఓటు విలువ 132 గా నిర్ణయించారు.
ఎంపీల ఓట్ల విలువ..
1.దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 54,9495.
2.దీన్ని ఎంపీల సంఖ్య 776- 543 (లోక్సభ ఎంపీలు), 233(రాజ్యసభ ఎంపీలు) తో భాగిస్తారు. అదే 708.112 వస్తుంది.
3.దాన్నే 708 గా ఖరారు చేశారు.
గ్రీన్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎంపీలు, పింక్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 21న పార్లమెంట్హౌస్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.