పునర్జన్మలు ఉన్నాయా? ఈనాటికీ సైన్స్ కూడా పూర్తిగా సమాధానం చెప్పలేకపోతున్న ప్రశ్న ఇది. కానీ.., ఈ సువిశాల విశ్వంలో కంటికి కనిపించేది మాత్రమే సత్యం, సైన్స్ ప్రూవ్ చేసేది మాత్రమే నిజం అనుకుంటే మనం పొరబడినట్టే. ఇక్కడ మనిషి జ్ఞానికి అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఈ పునర్జన్మ కాన్సెప్ట్ కూడా అందులో ఒక భాగం ఎందుకు కాకూడదు?
ఈ అనుమానాన్ని ఇంకాస్త బలపరిచే ఘటన తాజాగా చోటు చేసుకుంది. బోటు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు బిడ్డలు, తిరిగి రెండేళ్ల తరువాత అదే తేదీన, ఆ తల్లి కడుపునే జన్మించారు. ఈ అద్భుతం జరిగింది ఎక్కడో విదేశాల్లో కాదు, పునర్జన్మలని బలంగా విశ్వశించే మన సనాతన భారతదేశంలోనే. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. పునర్జన్మ గురించి కాలజ్ఞానంలో బలంగా ప్రస్తావించిన మన బ్రహ్మం గారు నడియాడిన ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదనే.అది.. సెప్టెంబర్ 15, 2019 ఆదివారం. అంతకముందు వరకు భారీ వర్షాలకి పోటెత్తిన గోదావరి.. ఆ ముందు రోజే కాస్త శాంతించింది. దీంతో.. తూర్పుగోదావరి జిల్లా.. దేవీపట్నం నుండి భద్రాచలం రాముల వారి దర్శనార్ధం రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు బయలు దేరింది. గోదారమ్మ ఒడిలో కాసేపు సేద తీరి, రామయ్యని దర్శించుకోవాలనుకున్నారు ప్రయాణికులు. కానీ.., కచ్చులూరు వద్ద ప్రమాదం జరిగి, ఆ బోటు గోదావరిలో మునిగిపోయింది. ఈ విషాద ఘటనలో మొత్తం 50 మంది ప్రాణాలను కోల్పోయారు.
విశాఖపట్టణానికి చెందిన అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతుల కుటుంబంలో మొత్తం 11 మంది ఈ ప్రమాదంలోనే చనిపోయారు. అప్పలరాజు దంపతుల ఇద్దరు కూతుర్లు మూడేళ్ల గీతా వైష్ణవి, ఏడాది వయస్సున్న ధాత్రి అనన్య కూడా గోదావరిలో మునిగిపోయారు. ఆ కుటుంబంలో ఈ దంపతులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ.., కళ్ళ ముందే కన్న బిడ్డలు చనిపోయారు. కుటుంబం అంతటిని గోదారమ్మ తనలో కలిపేసుకుంది. దీంతో.. వారు కొన్ని రోజుల వరకు జీవచ్ఛవాల్లా బతికారు. పలకరించే దిక్కు లేదు. రక్త సంబంధీకులు అన్న మాట లేదు. ఆ దంపతులు ఒక్కసారిగా అనాధలు అయిపోయారు. ఆ విషాద క్షణాలు నిమిషాలు అయ్యాయి. నిమిషాలు గంటలు అయ్యాయి, గంటలు రోజులు అయ్యాయి. అప్పలరాజు దంపతులు నిదానంగా ఆ బాధ నుండి కోలుకున్నారు. తమకంటా మళ్ళీ రక్త సంబంధీకులు కావాలనుకున్నారు. ఆ క్షణాన తాము ఓ బిడ్డకి జన్మనివ్వాలని నిర్ణయించుకున్నారు.భాగ్యలక్ష్మికి అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ జరిగిపోయి ఉంది. అయినా.. పిల్లలు కావాలన్న వారి ప్రయత్నం ఆపలేదు. ఇందులో భాగంగానే ఏడాది క్రితం ఫెర్టిలిటీ డాక్టర్ పి. సుధాని సంప్రదించారు. దీంతో.. డాక్టర్ సుధా IVF విధానం గురించి ఆ జంటకు వివరించారు. అలా చికిత్స చేయించుకుని గర్భం ధరించిన భాగ్యలక్ష్మి అక్టోబర్ 20కు డెలివరీ డేట్ ఇచ్చారు డాక్టర్స్. అంటే డెలవిరీకి ఇంకా నెల సమయం ఉంది. కానీ.., విధి రాత ఇంకోలా ఉంది!
రెండేళ్ల క్రితం ఏ సెప్టెంబర్ 15న అయితే భాగ్యలక్ష్మి తన ఇద్దరు బిడ్డలను కోల్పోయిందో.. అదే సెప్టెంబర్ 15న ఆ తల్లికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో.. భాగ్యలక్ష్మిని హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకొచ్చారు. డాక్టర్స్ వెంటనే ఆమెకి సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అలా.. భాగ్యలక్ష్మికి సెప్టెంబర్ 15వ తేదీన ఆపరేషన్ జరిగిపోయింది. కానీ.. విచిత్రం ఏమిటో తెలుసా? ఆమెకి జన్మించింది ఇద్దరు ఆడపిల్లలు. అంటే సరిగ్గా.. రెండేళ్ల తరువాత.. అదే రోజు, అదే సమయంలో, ఆ ఇద్దరు ఆడ పిల్లలే ఆ తల్లి కడుపున మళ్ళీ జన్మించారు.
భాగ్యలక్ష్మికి అప్పుడే నొప్పులు ఎందుకు వచ్చాయో డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. ఆ సమయానికే ఆ చిన్నారి తల్లులు భూమి మీదకి రావాలని నిర్ణయించబడి ఉంది. డాక్టర్స్ మాత్రం తమకి తెలిసిన సైన్స్ భాషలో ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ అంటున్నారు. కానీ.., ఆ తల్లిదండ్రులు మాత్రం.. చనిపోయిన తమ ఇద్దరు కూతుర్లే మళ్ళీ మాకు దక్కారు అంటూ సంబరపడిపోతున్నారు. ఇక్కడే సైన్స్ కి అందని కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1) పిల్లలు కావాలని కోరుకుంటున్న వారికి కూడా ఈరోజుల్లో సులువుగా సంతానం కలగడం లేదు. IVF విధానం కూడా అందరి విషయంలో సక్సెస్ కావడం లేదు. కానీ.., పిల్లలు లేకుండా అప్పటికే ఆపరేషన్ చేపించుకున్న భాగ్యలక్ష్మికి అంత పర్ఫెక్ట్ గా క్యారీయింగ్ ఎలా సెట్ అయినట్టు?
2) భాగ్యలక్ష్మి గర్భం దాల్చింది IVF విధానం ద్వారా కాబట్టి ఇది సైన్స్ వల్ల అనుకుందాం. కానీ.., ఆమెకి సరిగ్గా కవలలు పుట్టడం ఏమిటి? అది కూడా ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
3) భాగ్యలక్ష్మి మెడికల్ హిస్టరీ మొత్తం డాక్టర్ సుధా తెలుసు. ఆమె లెక్క ప్రకారం భాగ్యలక్ష్మి డెలివిరీకి అక్టోబర్ 20 వరకు సమయం ఉంది. కానీ.., సరిగ్గా సెప్టెంబర్ 15వ తేదీన ఆమెకి పురిటి నొప్పులు రావడాన్ని ఏమనాలి? ఆ రోజే ఇద్దరు ఆడ పిల్లలు అమ్మ కడుపు నుండి ఈ భూమి మీదకి ఎందుకు రావాలి? ఇది విధి మహిమ కాక మరేంటి? పునర్జన్మ సంకేతం కాక మరేంటి?
సైన్స్ అన్నీ సమస్యలకి పరిష్కారాన్ని అందించవచ్చు. కానీ.., అన్నీ అద్భుతాలకు సమాధానం చెప్పలేదు. ఈ లెక్కన చూస్తే అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులకి ఇప్పుడు పుట్టింది.. రెండేళ్ల క్రితం వారు కోల్పోయిన గీతా వైష్ణవి, ధాత్రి అనన్యే అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.