ప్రేమించేదాక అమ్మాయిల వెంట పడటం, నువ్వు లేకపోతే నేను జీవించలేను అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పడం, ప్రేమించాక కొన్నాళ్లు కలిసి తిరగడం, ఆ తర్వాత మొహం చాటేయడం కొంత మంది యువకులకు పరిపాటిగా మారిపోయింది. మోసం చేసిన ప్రేమికుడు పట్ల ప్రియురాలు ఏం చేసిందంటే..?
ఇటీవల టైంపాస్ ప్రేమలు ఎక్కువయ్యాయి. ప్రేమించేదాక అమ్మాయిల వెంట పడటం, నువ్వు లేకపోతే నేను జీవించలేను అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పడం, ప్రేమించాక కొన్నాళ్లు కలిసి తిరగడం, అన్ని అయిపోయాక మొహం చాటేయడం కొంత మంది యువకులకు పరిపాటిగా మారిపోయింది. తీరా పెళ్లి చేసుకోమనే సరికి మొహం చాటేస్తున్నారు. కొంత మంది అమ్మాయిలు.. ఈ మోసాన్ని భరించలేక కొంత మంది అమ్మాయిలు మానసికంగా క్రుంగిపోయి అఘాయిత్యాలకు పాల్పతుంటే.. మరికొంత మంది తల్లిదండ్రులు చెప్పిన వివాహం చేసుకోవడం లేదా ఇతర వ్యాపకాలతో బిజీగా మారిపోవడం చేస్తున్నారు. కానీ ఈ ప్రేమికురాలు.. ప్రియుడి ఇంట పోరాటానికి దిగింది.
వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన సురేష్ అనే వ్యక్తిని ప్రేమించింది ఓ అమ్మాయి. ఎనిమిదేళ్ల పరిచయం ప్రేమగా మారింది. యువతి బీటెక్ పూర్తి చేసి.. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కు వచ్చింది. ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. అయితే సురేష్కు బెంగళూరులో మంచి ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్లాడు. ఉద్యోగం రాగానే యువతిని పట్టించుకోవడం మానేశాడు సురేష్. పెళ్లి చేసుకోవాలని పలుసార్లు ఫోన్ చేయగా..దాట వేశాడని, కొన్ని రోజులకు తన నంబర్ బ్లాక్ చేశాడని యువతి చెబుతుంది. అతని మనసు మార్చుకుంటాడని వేచి ఉండగా.. అతడి నుండి ఎటువంటి స్పందన రాలేదని తెలిపింది.
తీరా అతడి గురించి ఆరా తీయగా.. మరో యువతితో అతడికి పెళ్లి కుదిరిందని తెలిసింది. ఈ విషయాన్ని తన బాబాయికి చెప్పింది. వెంటనే ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి పోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని నిరసన చేపడుతోంది. ప్రేమ పేరుతో మోసం చేశాడని.. తనను పెళ్లి చేసుకోవాలని యువతి డిమాండ్ చేస్తోంది. అతడితోనే కలిసే బతకాలని కోరుకుంటున్నానని పేర్కొంది. కాగా, సురేష్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లినట్లు కూడా సమాచారం.