ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, మాజీ బిగ్ బాస్ పార్టిసిపెంట్ కత్తి మహేశ్ కన్ను మూశారు. గత నెల 26న కత్తి మహేశ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పుడు వెంటనే ఆయన్ని నెల్లూరులోని మెడి కేర్ హాస్పిటల్ కి తరలించారు. తరువాత మెరుగైన చికిత్య కోసం కత్తి మహేశ్ ని చెన్నై లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
అప్పటి నుండి కత్తి మహేశ్ కి అక్కడే చికిత్స కొనసాగుతూ వస్తోంది. యాక్సిడెంట్ లో ఆయన కుడి కన్ను చాలా వరకు డ్యామేజ్ కావడంతో అందుకు సంబధించిన ఆపరేషన్ కూడా వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే.., తల భాగంలో బలమైన గాయాలు తగలడంతో కత్తి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని, అతని ప్రాణాలకి అయితే ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్స్ అప్పుడే తెలియచేశారు.
ఆపరేషన్ జరిగిన తరువాత నుండి కత్తి మహేశ్ శరీరం మెడిటేషన్ కి సహకరించకుండా పోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాలు ఏవి ముందుగా బయటకి రాలేదు. కత్తి మహేశ్ వైద్య ఖర్చులకి సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం ప్రకటించడంతో కత్తి మహేశ్ కోలుకున్నట్టే అంతా భావించారు. కానీ.., తలలోని బలమైన గాయాలు మానవకపోవడంతో కత్తి మహేశ్ చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. అయితే.., కత్తి మహేశ్ మరణానికి సంబంధించిన పూర్తి నిజాలు తెలియాల్సి ఉంది.