సహజీవనం, వివాహేతర సంబంధాలకు కుటుంబాలు నాశనం అవ్వడమే కాదూ.. అభం, శుభం తెలియని చిన్నారుల జీవితాలు ఛిద్రం అయిపోతున్నాయి. భర్త సరైనవాడు కాదని మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగితే.. అతడు తన అవసరానికి వాడుకుని.. ఆ తర్వాత వారిని వదిలించుకునేందుకు
సహజీవనం, వివాహేతర సంబంధాలకు కుటుంబాలు నాశనం అవ్వడమే కాదూ.. అభం, శుభం తెలియని చిన్నారుల జీవితాలు ఛిద్రం అయిపోతున్నాయి. భర్త సరైనవాడు కాదని మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగితే.. అతడు తన అవసరానికి వాడుకుని.. ఆ తర్వాత వారిని వదిలించుకునేందుకు ఏకంగా కడతేర్చుతున్నాడు. ఎంతో జీవితాన్ని చూడాల్సిన పసిపిల్లలు బాధితులు అవుతున్నారు. అమ్మ ఏం చేస్తుందో తెలియదు.. ఆమె నివసిస్తున్న వ్యక్తినే తండ్రిగా భావిస్తున్న పిల్లల్ని.. ముఖం చూసి కూడా జాలి చూపడం లేదు కొంత మంది శాడిస్టులు.. వారిని బలితీసుకుంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పుప్పాల సుహాసిని కుటుంబంలో ఇదే జరిగింది.
వివరాల్లోకి వెళితే.. సుహాసిని భర్తతో గొడవల కారణంగా దూరంగా ఉంటుంది. కుమార్తె కీర్తన(13)తో కలిసి కూలి పనులు చేసుకుని బతుకుతోంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్తో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం వీరు గుంటూరు జిల్లా తాడేపల్లిలో కాపురం ఉంటున్నారు. వీరికి జెర్సీ అనే పాప కూడా పుట్టింది. అయితే రాజమండ్రిలో పని ఉందని చెప్పి.. ముగ్గుర్ని కారులో తీసుకొని వెళ్లాడు.. షాపింగ్ చేయించాడు. అక్కడక్కడ తిప్పాడు. వారికి తెలియని వాస్తవమేమిటంటే.. చంపేందుకే అక్కడకు తీసుకెళ్లాడని. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో రావుల పాలెంలోని గౌతమి పాత వంతెన వద్దకు వారిని తీసుకెళ్లాడు. అనంతరం కారు అక్కడ ఆపి.. ఇక్కడ ఫోటోలు దిగుతామని చెప్పాడు. సుహాసిని, పిల్లల్ని రెయిలింగ్ దగ్గర పిట్టగోడపై నిలబెట్టాడు. ఫోటో తీస్తున్నట్లుగా నటించి.. ముగ్గుర్ని గోదాట్లోకి తోసేశాడు.
తర్వాత కారు తీసుకుని పారిపోయాడు. సుహాసిని, జెర్సీ నదిలో పడిపోగా.. కీర్తన మాత్రం వంతెన పక్కగా వేసిన కేబుల్ పైపు చేతికి అందడంతో గట్టిగా పట్టుకుంది. అనంతరం కాపాడండీ అంటూ కేకలు వేసింది. ఎవ్వరూ స్పందించకపోవడంతో తన దగ్గర ఫోన్ ఉన్న విషయం గుర్తుకు వచ్చి.. తాను పడిపోకుండా పైపును పట్టుకుని.. 100 నంబర్కు కాల్ చేసింది. ఫోనులో జరిగిందంతా చెప్పడంతో.. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని కీర్తనను రక్షించారు. పైపుకి వేలాడి ప్రాణాలు కాపాడుకొని.. తమకు ఫోన్ చేసిన కీర్తన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. చిన్నారి కీర్తనను రక్షించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. కాగా, నదిలో కొట్టుకుపోయిన తల్లి, సంవత్సరం పాప కోసం గాలిస్తున్నారు పోలీసులు. సుహాసిని, సురేష్ మధ్య గొడవ జరగడంతోనే వీరిని అంతమొందించాలని భావించినట్లు తెలుస్తోంది. నిందితుడు కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
హ్యాట్సాఫ్ కీర్తన.. పెంపుడు తండ్రి గోదావరిలోకి నెట్టినా ప్రాణాలు కాపాడుకుంది
గుంటూరు జిల్లాకి చెందిన ఉలవ సురేష్ తాను సహజీవనం చేస్తున్న పుప్పాల సుహాసిని (36)ని ఆమె కుమార్తెలు కీర్తన (13), జెర్సీ (1) లను వదిలించుకోవాలని ఆదివారం ఉదయం నాలుగు గంటలకు గోదావరిలోకి నెట్టి వేశాడు. ఈ… pic.twitter.com/SZbaqjmjJ7
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2023