సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్కెఎన్ నిర్మాణంలో, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'బేబి. జులై 14న ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ కల్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దాదాపు 75 కోట్ల కలెక్షన్స్ అందుకుని బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్కెఎన్ నిర్మాణంలో, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబి. జులై 14న ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ కల్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దాదాపు 75 కోట్ల కలెక్షన్స్ అందుకుని బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దాంతో ఈ సినిమా సెలబ్రిటీస్కి కూడా నచ్చడంతో స్పెషల్ ఈవెంట్లు పెట్టి మరీ అభినందిస్తున్నారు. గతంలో ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ సైతం స్పెషల్ మీట్లో భాగంగా ‘బేబి’ మూవీ టీమ్కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తాజాగా చిరంజీవి కూడా మెగా సెలబ్రేషన్స్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు.
ఈ ఈవెంట్లో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవిని దురదృష్టవంతుడని అన్నారు. దానికి గల కారణం మీరు మెగా స్టార్ అయిపోవడం. ఆ కారణంగా మీరు చిరంజీవి అభిమాని కాలేకపోయారు. చిరంజీవిని ఆరాధించే మేము మాత్రం చాలా అదృష్టవంతులం’’ అని చెప్పారు. “ఒక చిరంజీవి అభిమానికి ఉండే అదృష్టం మీకు లేదు. మా లైఫ్ని మీరు ఎప్పటికి చూడలేరు. భాదలో ఉంటే చిరంజీవి పాట, జ్వరంలో ఉంటే చిరంజీవి పాట, సంతోంషంగా ఉంటే చిరంజీవి పాట, మా పారాసిటమాల్ మీరే.. మా మ్యన్షన్ హౌస్ మీరే” అని చేప్పడంతో ఆడిటోరియం కేకలతో హోరెత్తిపోయింది.
‘‘అది అమెరికా అయినా, చిన్న ఊరిలో ఆటోవాలా అయినా మీ సినిమాలు, మీ పాటలే అసలైన కిక్కు. మెగా స్టార్ అభిమానిగా ఎప్పుడు గర్వపడుతూంటా.. హైదరాబాద్ వచ్చిన కొత్తలో చిరంజీవిగారిని కలిస్తే చాలనుకున్నా. బ్లడ్ బ్యాంక్కు వెళ్లి బ్లడ్ ఇచ్చి వస్తుంటే చిరంజీవిగారు వస్తున్నారు అని చెప్పారు. మేము బలంగా అనుకుంటే మీరు తప్పకుండా కలుస్తారు. బేబి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మీరు రావాలని, అనుకున్నాం. అఫ్పుడు యూఎస్లో ఉన్నారు. కానీ మేము గట్టిగా నమ్మాం. మమ్మల్ని ఆశీర్వదించాడానికి వస్తారని అనుకున్నాం. అనుకునట్టుగానే మీరు వచ్చార’’ని సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.
ఇక చిరంజీవి మాట్లడుతూ.. “నేను బేబి విజయోత్సవ సభకు వచ్చానా లేక, నా సన్మాన సభకు వచ్చానా అన్నది అర్థంకావడంలేదు. ప్రస్తుతం నా జీవితంలో అనేక మధుర ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు పుత్రోత్సాహం, మరో వైపు తోబుట్టువుల అభివృద్ది. ఇంకోవైపు మేనల్లుళ్ల ఎదుగుదల, అలాగే.. మిత్రులు అభివృద్ది చెందడం చూస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నా. అభిమానులు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముళ్లు అనుకుంటాను.. వీళ్లలో అనేక మంది నన్ను ప్రేరణగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చి విజయాలు సాధిస్తూ.. తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అభిమానుల ప్రయత్నం ఇంత విజయవంతమైనందుకు అభినందించాలనే ఈ కార్యక్రమానికి వచ్చాను” అని మెగాస్టార్ మాట్లాడారు.