మిద్దె మీద ఎవరైనా నాలుగు చెట్లు పెంచుకుంటారు. కూరగాయల కోసం మిద్దె తోటలను పెంచుకుంటారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. కానీ.., మిద్దె మీద ఏకంగా గంజాయి తోట పెంచుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి! ఎందుకంటే.. ఇప్పుడు ఓ పెద్దాయన ఇలా మిద్దె మీదే గంజాయి తోటని పెంచి.., పోలీసులకి సైతం షాక్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం, పెద్ద కౌకుంట్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు చాలా ఏళ్ళుగా గంజాయికి అడిక్ట్ అయిపోయి జీవిస్తూ వస్తున్నాడు. అయితే.., కొంత కాలంగా జిల్లాలో గంజాయి అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. క్రమంగా ఆంజనేయులకి గంజాయి దొరకడమే కష్టం అయిపోయింది. దీంతో.., ఎవరి దగ్గరో ఎందుకు కొనాలి? అసలు నేనే ఎందుకు గంజాయి పండించకూడదని అనుకున్నాడు ఆంజనేయులు. అనుకున్నదే ఆలస్యం.. తన ఇంటి మిద్దె మీద గంజాయి చెట్లు పెంచడం మొదలు పెట్టాడు.
మూడో కంటికి తెలియకుండా.., జిల్లాలో తానే గంజాయిని సరఫరా చేయడం మొదలు పెట్టాడు. ఇందులో మంచి లాభం వస్తుండటంతో మిద్దె మీద ఏకంగా గంజాయి తోటనే పెంచేశాడు. ఆంజనేయులు ఇంటి మిద్దె మీద మొత్తం చెట్లు పెరిగిపోతే.. అతన్ని చుట్టూ పక్కల వారు ప్రకృతి ప్రేమికుడు అనుకున్నారే గాని.., ఇలా గంజాయి పెంచుతున్నాడని తెలుసుకోలేకపోయారు. అయితే.., వేరే గంజాయి కేసుని విచారిస్తుంటే.. పోలీసులకి అంజేయులు గురించి తెలిసింది. దీంతో.. పోలీసులు ఆంజనేయులు ఇంట్లో తనికీలు జరపగా.. వారికి మిద్దె మీద ఏకంగా గంజాయి తోటే దర్శనం ఇచ్చింది. దీంతో.., బిత్తరపోవడం పోలీసుల వంతైంది. ఆంజనేయులుపై కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. మరి.., మిద్దె మీదే సింపుల్ గా గంజాయి తోట పండించిన ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.