కరోనా విపత్కర పరిస్థితుల్లో సినీ సెలబ్రిటీలు వరుసపెట్టి పెళ్లి పీటలెక్కుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో పలువురు హీరో హీరోయిన్లు చేరిపోగా.. ఇటీవలి కాలంలో హీరోయిన్ తాప్పీ పెళ్లి గురించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా వార్తలపై చెప్పీ చెప్పనట్టుగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన తాప్సి.. ఆ తర్వాత కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ ఇప్పుడు బాలీవుడ్ బిజీ హీరోయిన్స్లో ఒకరుగా కొనసాగుతోంది.
గత కొంతకాలంగా డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్తో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఈ ముద్దుగుమ్మ.. దీనిపై ఓపెన్ అయింది. మాథ్యూస్తో అతిత్వరలో తాప్సి పెళ్లి జరగబోతోందంటూ నడుస్తున్న టాక్పై క్లారిటీ ఇచ్చేసింది. సినీ రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పిన తాప్సి.. రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం వేర్వేరుగా ఉండాలని చెబుతూ మాథ్యూస్తో పెళ్లిపై చిన్న హింట్ ఇచ్చింది. ప్రస్తుతం సంవత్సరానికి ఆరు సినిమాలు చేస్తున్నానని, ఆ సంఖ్య రెండు లేదా మూడుకు తగ్గినపుడే పెళ్ళి చేసుకుంటానని తాప్సి క్లారిటీగా చెప్పేసింది. పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రమే వివాహం గురించి ఆలోచిస్తానని చెప్పింది.దీంతో ఈమె మాటలే విన్నవారంతా పిల్లలపై తాప్సీకి ఎప్పుడు మనసు పుడుతుందో మరి అంతా కామెంట్లు చేస్తున్నారు.