కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథంకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు చోట్ల ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. రైల్వే స్టేషన్ లో రైళ్లను, అక్కడ ఫర్నీచర్లకు నిప్పు పెట్టారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. కొన్ని గంటల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండాన్ని తలపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై అనేక మంది రాజకీయ, ఇతర ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. అగ్నిపథ్ స్కీమ్ కు మద్ధతు తెలుపుతూ పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“బ్రిటీష్ వారి కాలం నాటి ఆర్మీ రిక్రూట్ మెంట్ వ్యవస్థను తీసివేసి కొత్తగా అగ్నిపథ్ అనే స్కీమ్ ద్వారా ఆర్మీలో పోస్టులు భర్తీ చేయాలని కేంద్ర రక్షణ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసించాలి. కౌమారం నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న మన దేశంలో యువతలో దేశభక్తిని , క్రమశఇక్షణనునింపే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. రెజిమెంట్ల పేరుతో ప్రాంతీయ విద్వేషాలను , విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ విధానానికి చరమ గీతం పాడుదాం. దేశాన్ని బలంగా తయారు చేద్దాం…ఇప్పుడు యువత టిక్ టాక్ .. ఇన్ స్టాగ్రామ్.. యూట్యూబ్.. ఇలా చెడిపోయే కన్నా దేశ రక్షణ కోసం సైన్యం లో చేరితే మంచిదేగా.. జై హింద్ జై భారత్.. జై జవాన్” అంటూ కరాటే కళ్యాణి పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఆమె పెట్టిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.