సాధారణంగా అందరూ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వచ్చిన తరువాత పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు ఇంకొంచెం ఎక్కువయ్యాయి. అయినా కొందరు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. మరి కొంతమంది మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా జీవిస్తుంటారు. అయినా వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి వారందరికీ ఓ రోల్ మోడల్ లాంటి వ్యక్తి ఒకాయన దొరికేశాడు. ఆయన జీవన విధానం తెలుసుకుంటే మీరు కచ్చితంగా షాకవుతారు. ఎలాంటి పరిశుభ్రత గానీ, మంచి ఆహారం గానీ తీసుకోకుండానే ఆరోగ్యంగా ఉన్నాడు. 87 ఏళ్ల వయసులోనూ అలాంటి జీవన విధానంతో ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉండటాన్ని చూసిన స్థానికులు నిర్ఘాంతపోతున్నారు.
ఇది కూడా చదవండి: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన APSRTC..
ఇరాన్ లోని దేజ్ గ్రామంలో 87 ఏళ్ల అమో బాజి అనే వృద్ధుడు ఒంటరిగా జీవిస్తున్నాడు. పంది కొక్కులు, కుందేళ్లను తినడం, ఆ పరిసరాల్లోని కుంటల్లోని నీరు తాగుతూ కాలం గడుపుతున్నాడు. ఆయన 67 ఏళ్లుకు పైగా స్నానమే చేయలేదట. అయితే ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడం ఇక్కడ కొసమెరుపు. అంతేకాదు అతను ఒంటరిగానే జీవిస్తున్నాడు.. చాలాకాలం అతను సొరంగంలోనే జీవించాడట. అయితే అతని విచిత్ర జీవన శైలిని చూసి ఆశ్చర్యపోయిన దేజ్ గ్రామస్థులు ఆ వృద్ధుడు కోసం ఒక పూరి గుడిసెను నిర్మించారు. అతను ఇలాంటి జీవనశైలితో కూడా ఆరోగ్యంగా ఉండటం చూసి శాస్త్రవేత్తలు, పరిశోధకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
విషయం తెలుసుకున్న టెహ్రాన్ లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన ఓ ప్రొఫెసర్ ఆ వృద్ధుడికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇన్నేళ్లుగా ఆ వృద్ధుడు స్నానం చేయనప్పటికీ అతని శరీరంలో ఎలాంటి పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు లేవని చాలా ఆరోగ్యంగా ఉన్నాడని తేల్చారు. స్థానిక గవర్నర్ అతన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టవద్దని స్థానికులను కోరడం గమనార్హం. శాస్ర్తవేత్తలను సైతం ఆశ్చర్యపరిచన ఈ వృద్ధుడి జీవనశైలిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.