శాస్త్ర సాంకేతికతకు సైతం అంతు చిక్కని రహస్యాలున్నాయి. బెర్ముడా ట్రయాంగిల్స్, బ్లాక్ హోల్ వంటివి కూడా ఇంకా సరైన సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే ఉన్నాయి. అలాగే ప్రకృతి తన ఒడిలో అనేక రహస్యాలను దాచుకుంది. వాటిల్లో హిమనీనదాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి బ్లడ్ ఫాల్స్ రివర్ అంటారు. అంటార్కిటాకాలో ఉన్న ఈ నదీ రహస్యాన్ని శాస్త్రవేత్తలు చేధించారు.
విశ్వం వింతలు, విడ్డూరాల సమాహారం. ప్రపంచంలో అనేక విశేషాలున్నాయి. శాస్త్ర సాంకేతికతకు సైతం అంతు చిక్కని రహస్యాలున్నాయి. బెర్ముడా ట్రయాంగిల్స్, బ్లాక్ హోల్ వంటివి కూడా ఇంకా సరైన సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే ఉన్నాయి. అలాగే ప్రకృతి తన ఒడిలో అనేక రహస్యాలను దాచుకుంది. వాటిల్లో హిమనీనదాలు కూడా ఉన్నాయి. వాటి కింద అనేక వింతలు, విడ్డూరాలున్నాయి. కొన్నింటిని శాస్త్రవేత్తలు చేధిస్తున్నప్పటికీ.. మరి కొన్ని ప్రశార్థకాలుగా మిగులుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటి అంటార్కిటాకాలో ఉన్న రక్తపు నదీ జలపాతం. ఆ నది ఎర్రటి రంగుల్లో ప్రవహించడం వెనుక అనేక కథలు ఉన్నప్పటికీ.. దీని వెనుక రహస్యాన్నిశాస్త్రజ్ఞులు చేధించారు.
అంటార్కిటికా ఖండం తెల్లటి మంచుతో కప్పబడి ఉంటుటంది. అక్కడ సూర్యకాంతి ప్రసరణ తక్కువ. అలాంటిదీ మెక్ముర్డో డ్రై వ్యాలీస్లో ఉన్న ఓ నదీ జలపాతం మాత్రం ఎర్రటి రంగులో నెత్తుటి ధారలా ప్రవహిస్తూ చూసే వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. దీనినే బ్లడ్ ఫాల్స్ రివర్ అంటారు.1911లో ఆస్ట్రేలియన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త థామస్ గ్రిఫిత్ టేలర్ దీనిని కనుగొన్నప్పటి నుండి, ఈ ఎర్రటి నదీ ప్రవాహం వెనుక కారణాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తితో ఉన్నారు. ఈ నెత్తుటి జలపాతం గురించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఈ నదీ ఎరుపు, నారింజ రంగు, బూడిద వర్ణంలో ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఎట్టకేలకు అలా ఎర్రటి రంగులో ప్రవహించడానికి కారణాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. బ్రిటన్ వెబ్సైట్ డైలీ స్టార్ నివేదిక ప్రకారం..యూనివర్శిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్బ్యాంక్స్ పరిశోధకులు ఈ నది మిస్టరీని చేధించారు. ఈ నదీ జలపాతం వయస్సు సుమారు 1.5 మిలియన్ సంవత్సరాలు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మొదటి నుండి కొనసాగుతున్న ఆక్సీకరణ కారణంగా ఈ నది నీరు రక్తం రంగులో ఎర్రగా కనిపిస్తుంది. లోయలో ఐరన్ కంటెంట్తో కూడిన ఉప్పునీరు అధికంగా ఉండడం దీనికి కారణమని పరిశోధకులు తెలిపారు. ఈ సరస్సులో కాంతి, ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉండటంతో ఎర్రటి రంగులో నదీ ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. ఐరన్ కంటెంట్ ఉన్న ద్రవం.. గాలిలో ఉన్న ఆక్సిజన్తో తాకినప్పుడు, అది తుప్పు పట్టి, నీరు రక్తం రంగులో ఎర్రగా మారుతుందని చెప్పారు. ఏళ్ల తరబడి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందన్నారు.అయితే నేషనల్ జియోగ్రాఫిక్లో ఇంతకు ముందు ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. శాస్త్రవేత్తలు, అన్వేషకుల బృందం ఈ మొత్తం ప్రాంతాన్ని అధ్యయనం చేసింది.
ఈ నదీ జలపాతం క్రింద ఉప హిమనదీయ నదులు, సరస్సుల ఉన్నాయని బృందం కనుగొంది.. ఇవి ఉప్పు నీటితో నిండి ఉన్నాయి. ఈ నదిలో ఐరన్ కంటెంట్ ఉన్న ఉప్పు నదిని ఉప్పునీరుగా మారేలా చేసింది. ఈ బ్లడ్ ఫాల్స్ ఎత్తు ఐదంతస్తుల భవనంతో సమానం. ఎర్త్ స్కై నివేదిక ప్రకారం.. బ్లడ్ ఫాల్స్ నీటిలో ఆక్సిజన్ లేదని పరిశోధకుల బృందం పరిశోధన తర్వాత కనుగొంది. అయితే 17 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. సల్ఫేట్ తగ్గింపు ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సూక్ష్మజీవులు చాలా క్లిష్టమైన వాతావరణంలో నివసిస్తాయి. మొత్తానికి ఎన్నో ఏళ్ల నాటి నుండి ప్రశ్నార్థకంగా మిగిలిన ఈ నదీ ప్రవాహం ఎర్రగా ప్రవహించడం వెనుక రహస్యాన్ని చేధించగలిగారు.